Switch to English

చైనాతో ఇరాన్ చెట్టపట్టాల్.. ఇండియాకు ఇబ్బందేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మన పొరుగుదేశాలను మచ్చిక చేసుకుని తన వైపు తిప్పుకుంటున్న చైనా.. తాజాగా మనకు మిత్రదేశంగా ఉన్న ఇరాన్ తోనూ వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకుంటోంది. అమెరికాతో ఉన్న మన సంబంధాల రీత్యా ఇరాన్ ను నిర్లక్ష్యం చేయడం ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. ఇరాన్, చైనాల మధ్య 2016 నుంచి పెండింగ్ లో ఉన్న 40 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం చకచకా కదులుతుండగా.. ఇరాన్ లో మనం చేపట్టిన రైల్వే ప్రాజెక్టు ఆరంభం కాకుండానే చేజారిపోయే పరిస్థితి రావడం ఇరాన్ తో మన బంధాలు క్షీణిస్తున్నాయనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇది వ్యూహాత్మక బంధం దృష్ట్యా ఇండియాకు ఇబ్బందికరమేనంటున్నారు.

ఇరాన్ ను ఆర్థికంగా అణదొక్కాలనే ఉద్దేశంతో అమెరికా ‘చాట్సా’ చట్టం కిందకు ఆ దేశాన్ని తెచ్చింది. అంటే.. అమెరికాతో సంబంధాలు కోరుకుంటున్న ఇతర దేశాలు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయకూడదు. ఒకవేళ కాదని కొనుగోలు చేస్తే అమెరికా విధించే ఆర్థికపరమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికాతో ఉన్న మన బంధం నేపథ్యంలో ఇరాన్ నుంచి మనం చమురు కొనుగోలు చేయడంలేదు. ఈ విషయంలో అటు అమెరికాతోనూ, దాని మిత్రదేశాలపైనా ఆధారపడి ముందుకెళ్తున్నాం. ఈ పరిస్థితి ఇరాన్ ఆర్థికంగా కుదేలు కావడానికి కారణమైంది.

అయితే చైనా మాత్రం అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడానికి 280 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదర్చుకుంది. అలాగే ఇరాన్ లో పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల అభివృద్ధికి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని పేర్కొంది. ఇవన్నీ ఇరాన్ కు ఊరటనిచ్చారు. దీంతో చైనాతో వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఇరాన్ లోని హసన్ రౌహానీ సర్కారు ముందుకు కదులుతోంది. దీంతో ఇరాన్ లోని చాబహార్ పోర్టులో పనులు చేపట్టిన భారత్ కు ఇబ్బంది తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ లో చైనా అభివృద్ధి చేస్తున్న గ్వాదర్ పోర్టుకు సమీపంలోనే చాబహార్ పోర్టు ఉంది. భారత్ కు ఇది వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. ఈ పోర్టు అభివృద్ధి పనుల కోసం గత బడ్జెట్ లో మన కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కూడా కేటాయించింది. అయితే, చాబహార్, జహేదాన్ మధ్య తలపెట్టిన 628 కిలోమీటర్ల రైలుమార్గానికి సంబంధించిన పనుల్లో నెలకొన్న జాప్యం ఇరాన్ కు అసహనం కలిగించింది. దీంతో ఆ పనులు తామే చేపడతామని తాజాగా ప్రకటించింది. చైనా అండ నేపథ్యంలోనే ఇరాన్ ఈ మేరకు ప్రకటన చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రక్షణ భాగస్వామ్యం సహా పలు అంశాల్లో చైనాకు ఇరాన్ దగ్గర కావడం భారత్ కు సమస్యలు తెచ్చిపెడతాయని చెబుతున్నారు. ఇప్పటికైనా మన విదేశాంగశాఖ తగిన చర్యలు చేపట్టి.. ఇరాన్ తో బంధాన్ని కొనసాగించుకోవాలని సూచిస్తున్నారు. అమెరికా ఎప్పుడూ తన ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని, అలాంటి దేశం కోసం మన వ్యూహాత్మక బంధాల్ని బలిపెట్టడం సబబు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...