ఎన్టీఆర్ విగ్రహం టచ్ చేస్తే ఎవరికైనా వణుకు పుట్టేలా చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించడం పట్ల ఆయన సీరియస్ అయ్యారు. ఈమేరకు 175 నియోజవర్గాల పార్టీ ఇన్ చార్జ్ లతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నాయకులు కావాలనే తొలగించారని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పోలీసులు కలిసి విగ్రహాన్ని తొలగించారని ఆరోపించారు. ఈమేరకు చంద్రబాబుకు వివరించడంతో.. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చలో కావలి కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాజధాని తరలిపోకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసామన్నారు. మరింతగా ఉద్యమం ఉధృతం చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయలేకపోతున్నారని అన్నారు. ప్రజలు మాస్కులు పెట్టుకోవాలని చెప్తున్న సీఎం జగన్ మాత్ర మాస్క్ పెట్టుకోవడం లేదని విమర్శించారు. సీఎం నిబంధనలు పాటించకుండా ప్రజలకు జరిమానా విధించడం ఏంటని ప్రశ్నించారు. న్యాయమూర్తిపై దాడి చేసింది మంత్రి అనుచరులే అని ఆరోపించారు.
74437 700587Should you happen to significant fortunate individuals forms, referring by natural indicates, additionally you catch the attention of some sort of envy in consideration of those types the other campers surrounding you which have tough times about this subject. awnings 299177
112373 625704Thank you for sharing with us, I believe this internet site genuinely stands out : D. 30355