దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ తగ్గుతోంది. నిన్న 2,538 కొత్త కేసులు, 143 మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 30వేలకు పడిపోయాయి. అయితే.. చైనా, ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కొత్త కేసులు రోజురోజుకీ పెరుగుతూండటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో వేవ్ వస్తుందనే వార్తల నేపథ్యంలో కేంద్రం అలెర్టయింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తోంది.
‘కరోనాపై అప్రమత్తంగా ఉండాలి. టెస్ట్, ట్రాక్, ట్రీట్, కోవిడ్ నిబంధనలు, వ్యాక్సినేషన్ పై దృష్టి సారించాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంపై అవగాహన పెంచాలి. వ్యాక్సినేషన్ పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దు’ అని ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ కూడా కరోనా నాలుగో వేవ్ అంచనాలను తేలిగ్గా తీసుకోవడం లేదు. కరోనా ఆంక్షలు ఎత్తి వేసిన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని చెప్తోంది. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్, ప్రజల్లో అవగాహన పెంచాలని అంటోంది.
252315 661986You need to join in a contest first of the finest blogs on the internet. I most undoubtedly will suggest this site! 828808
480824 194523I feel one of your ads triggered my internet browser to resize, you might want to put that on your blacklist. 921077