Switch to English

సీఎం జగన్ ఢిల్లీ టూర్‌ వెనుక రాజకీయం: ‘బ్లూ’ మీడియా సంచలనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. పలువురు మంత్రులూ ఇదే స్పష్టం చేశారు. సీఎం జగన్ ఢిల్లీ టూర్ విజయవంతమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. ఈ టూర్ చివర్లో చిన్న ట్విస్ట్ ఏంటంటే, వైసీపీ ఎంపీ భరత్ మార్గాని, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాని కలిసి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరడం. సరే, అది వైసీపీ హక్కు.. అనుకోండి. అది వేరే సంగతి. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్‌లో కీలక ఒప్పందం కుదిరిందట.. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో. ఈ మాట అంటోన్నది ‘బ్లూ’ మీడియా.

 

ఆ ‘బ్లూ’ మీడియా కథనం ప్రకారం, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో.. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కుదుర్చుకున్న ఆ ఒప్పందం రాజ్యసభ సీటు గురించి అట. ఏపీ నుంచి త్వరలో ఖాళీ అవబోయే ఓ రాజ్యసభ సీటుని, ప్రముఖ వ్యాపారవేత్త అదానీకి కట్టబెట్టబోతున్నారట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇదీ ‘బ్లూ’ మీడియా జోస్యం. ఇదే గనుక నిజమైతే, కాస్త ఆలోచించాల్సిన విషయమే. రాష్ట్రం నుంచి ఇప్పటికే పరిమల్ నత్వానీ అనే వేరే రాష్ట్రం వ్యక్తిని రాజ్యసభకు పంపింది అధికార వైసీపీ. ఆ పరిమల్ నత్వానీకి బీజేపీ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన కూడా ప్రముఖ వ్యాపారవేత్త కావడం గమనార్హం. అప్పట్లో, ఆయన పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఆ సీటు కొనుక్కున్నాడనే ఆరోపణలు వచ్చాయి. అబ్బే, అదేం లేదు.. బీజేపీ పెద్దల సూచనతో, వేరే దారి లేక జగన్.. అలా అంబానీకి సన్నిహితుడైన పరిమల్ నత్వానీకి రాజ్యసభ అవకాశం కల్పించారని మరికొందరు అంటారు.

 

చంద్రబాబు హయాంలో సురేష్ ప్రభుకి బీజేపీ సూచనతోనే రాజ్యసభ అవకాశం టీడీపీ కల్పించిన విషయం విదితమే. మన రాష్ట్రానికి చెందిన జీవీఎల్, వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. రాజ్యసభకు సంబంధించి ఇలాంటివి మామూలే. కానీ, ప్రాంతీయ పార్టీలిలా.. వేరే రాష్ట్రానికి చెందినవారికి ఏపీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడం ప్రతిసారీ విమర్శలకు తావిస్తోంది. అన్నట్టు, పరిమల్ నత్వానీ వల్ల రాష్ట్రానికి పారిశ్రామికంగా ఒరిగిందేమీ లేదు. అదానీ రాకతో ఏమైనా ఒరుగుతుందా.? అవన్నీ పక్కన పెడదాం.. జగన్ ఢిల్లీ టూర్ ఫలవంతంగా సాగిందంటే.. దానర్థం, ఏపీకి దక్కాల్సిన రాజ్యసభ సీటుని, బీజేపీకి సన్నిహితుడైన వేరే రాష్ట్రానికి చెందిన అదానీకి అప్పగించడమా.? ఈ వ్యవహారంపై అధికార వైసీపీ వివరణ ఇచ్చుకోవాల్సి వుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

ఎక్కువ చదివినవి

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...