Switch to English

ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్: ఇంతకీ ఏం సాధించినట్టు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ తదితరులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడివిడిగా భేటీలు నిర్వహించారు. ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయెల్, గజేంద్ర షెకావత్, ప్రకాష్ జవదేకర్ తదితర కేంద్ర మంత్రులతోనూ వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై వైఎస్ జగన్, కేంద్ర మంత్రులతో చర్చించినట్లు అధికార పార్టీ చెబుతోంది. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడం, రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరపడం అనేది సర్వసాధారణమైన వ్యవహారమే. వినతులు, విజ్నప్తులు.. ఇవన్నీ మామూలే.

ఇంతకీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానికి ఒరిగేదేంటి.? అన్నదే కీలకం ఇక్కడ. రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు, తనను ఇరకాటంలో పడేస్తున్న సొంత పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో తల బొప్పికట్టి, ఆ తలనొప్పిని తగ్గించుకునేందుకు కేంద్రం వద్ద సాగిలా పడేందుకు వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళారంటూ విపక్షాలు.. మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోన్న విషయం విదితమే.

తూచ్, విపక్షాలు చెప్పేది అసత్యం.. అని చెప్పుకోవాలంటే, అధికార పార్టీ.. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో ఏం సాధించారో వెల్లడించగలగాలి. కేంద్ర మంత్రుల్ని వైఎస్ జగన్ కలిశారు సరే, వారి నుంచి ఏం హామీలు రాష్ట్రానికి దక్కినట్లు.? పాచిందే పాటరా పాచిపళ్ళ డాష్ డాష్.. అన్నట్టు, పాత కథే మళ్ళీ చెప్పుకోవాలి. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వే జోన్, రాజధాని.. ఇలా విభజన హామీల్లో చాలా వ్యవహారాలున్నాయి. వాటిల్లో ఏ ఒక్కదాని విషయంలో అయినా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారా.? ఇచ్చి వుంటే.. అది ఘనంగా మీడియా ముందుకొచ్చి చెప్పి వుండేవారే కదా.?

అయిననూ పోయి రావలె హస్తినకు.. అన్న చందాన ప్రతిసారీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వుంటోంది తప్ప.. ఆ పర్యటనకు తగిన గౌరవం కేంద్రం ఎందుకు ఇవ్వడంలేదు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...