అసలే కరోనా కష్టాలతో జనం సతమతమవుతున్న వేళ రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే లీటరు పెట్రోలు ధర రూ.వంద దాటగా.. తాజాగా డీజిల్ ధర కూడా సెంచరీ మార్కు దాటింది. దీంతో దేశంలో తొలిసారిగా డీజిల్ ధర రూ.వంద దాటింది. శనివారం ఇంధన ధరలను చమురు ఉత్తత్తి సంస్థలు మరోసారి పెంచాయి. పెట్రోలుపై 27 పైసలు, డీజిల్ పై 23 పైసలు పెంచడంతో రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో డీజిల్ ధర రూ.100.05కి చేరింది. ఇక్కడ పెట్రోలు ధర ప్రస్తుతం రూ.107.22గా ఉంది.
దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ పై అత్యధిక వ్యాట్ ఉన్న రాష్ట్రం రాజస్థాన్ కావడంతో అక్కడ చమురు ధరలు ఎక్కువగా ఉంటాయి. రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీల్లో కూడా వ్యాట్ ఎక్కువగానే ఉంది. ఇప్పటికే రాజస్థాన్ తోపాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, లడఖ్ లలో పెట్రోలు ధర రూ.100 దాటగా.. తాజాగా కర్ణాటక కూడా ఆ మార్కు దాటేసింది. మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకు 23 సార్లు ఇంధన ధరలు పెంచడంతో పెట్రో ఉత్పత్తుల రేట్లు భారీగా పెరిగాయి.
582599 873243This internet page might be a walk-through like the data you wanted concerning this and didnt know who want to. Glimpse here, and you will definitely discover it. 797743
362196 857150Hello, Neat post. Theres an concern together with your site in web explorer, may well check this? IE still could be the marketplace leader and a huge component to folks will omit your great writing because of this issue. 944374
100389 501607Hi there! Nice post! Please do inform us when we could see a follow up! 287861