గతేడాది లాక్డౌన్ లో వలస కూలీలకు సాయం చేయడం దగ్గర నుంచి మొదలైన సోనూ సేవా కార్యక్రమాలు రెండో దశలోనూ కొనసాగుతోంది. ఈసారి సివిల్ సర్వీసెస్ లో చేరాలనుకునే వారికి అండగా నిలుస్తున్నారు. ఇందుకు ‘సంభవం’ పేరుతో ఆర్థికంగా సహకరించేందుకు ముందుకొచ్చారు. ఈ వివరాలను ఆయన వెల్లడిస్తూ.. ‘ఐఏఎస్ కు ప్రిపేర్ కావాలని అనుకుంటున్నారా? మీ బాధ్యత మేం తీసుకుంటాం. ‘సంభవం’ ప్రారంభిస్తున్నందుకు థ్రిల్లింగ్గా ఉంది’ అని సోనూసూద్ ట్వీట్ చేశారు.
సంభవంలో భాగంగా సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తామని తెలిపారు. ఇందుకు అర్హులు జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలుస్తోంది. వెబ్సైట్ వివరాలను ఆ ట్వీట్లో వెల్లడించారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సోనూసూద్ ఫౌండేషన్ ద్వారానే ‘సంభవం’ను కూడా నిర్వహిస్తున్నారు. కరోనా రోగులకు వైద్య సాయం, ఆక్సిజన్ సిలిండర్లు అందించడం.. వంటి కార్యక్రమాలతో ప్రజలకు విరివిగా సాయం అందిస్తున్నారు.
330911 22968Id ought to verify with you here. Which isnt something I often do! I take pleasure in reading a post that may make individuals feel. In addition, thanks for permitting me to comment! 866010
526325 225780Sweet website, super pattern , real clean and utilize genial . 297914