Upasana: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) భార్య ఉపాసన (Upasana) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (draupadi murmu) ను కలుసుకున్నారు. హైదరాబాద్ లో మెడిటేషన్ కు సంబంధించిన గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఆహ్వానం అందుకున్న ఉపాసన కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఉపాసన ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.
‘ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్ లో జరుగుతున్న కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు ధన్యవాదాలు. అరుదైన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అని తన వాల్ లో రాసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే.. ఉపాసన తనతోపాటు గారాలపట్టి క్లింకారను ఎత్తుకుని ఉన్న ఫొటోలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి.
క్లింకార ముఖం కనిపించకుండా ఉన్న ఫొటోలపై అభిమానులు ఆసక్తి కనబరిచారు. క్లింకారను మాకెప్పుడు చూపిస్తారని కామెంట్స్ చేశారు. ఇటివలే అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్న ఉపాసన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ ను కూడా కలుసుకున్నారు.