బాలికలపై అత్యాచారాలను అరికట్టాలని ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఇంకా వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటువంటి ఓ దురాగతం సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పంచాయితీలోని కిష్టయ్యపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్న 65 ఏళ్ల దయానంద్ తన ఇంట్లో పనిచేస్తున్న 15ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలికను మాయమాటలు చెప్పి కొన్ని నెలలుగా ఈ లైంగిక వాంఛ తీర్చుకోవడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. బాలికలో వస్తున్న మార్పులు గమనించిన కుటుంబసభ్యులు విచారించగా బాలిక జరిగిన ఘోరాన్ని చెప్పింది. దీంతో వారు పోలీసుల్ని ఆశ్రయించడంతో వారు ఆస్పత్రికి తరలించి పరిక్షలు చేయించారు. వైద్యులు ఆమె మూడు నెలల గర్భవతి అని నిర్ధారించారు. దీంతో పోలీసులు దయానంద్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
పెళ్లి చేసుకోవాలని యువతిని వేధిస్తున్న వ్యక్తి హత్యకు గురైన సంఘటన నిజాంపేట మండలంలో జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన జల్ల నర్సింహులు గౌడ్ అదే గ్రామానికి చెందిన యువతిని మైనర్ గా ఉన్నప్పటి నుంచీ ప్రేమిస్తున్నాడు. ఇటివల ఆమెకు మైనార్టీ తరడంతో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని భావించారు. దీంతో ఆమెను తనకిచ్చే పెళ్లి చేయాలని నర్శింహులు బెదిరిస్తున్నాడు.
దీంతో యువతి తండ్రి, బంధువులు, కొందరు గ్రామస్థులు కలిసి నర్సింహులుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన నర్శింహులును రామాయంపేటకు తరలిస్తూండగా మృతి చెందాడు. నిందితులు పరారీలో ఉన్నారు. నర్శింహులు వేధిస్తున్నాడంటూ యువతి తల్లిదండ్రలు గతేడాది నిజాంపేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అతనిపై ఫోక్సో చట్టం నమోదు చేయడంతో నర్శింహులు జైలు శిక్ష కూడా అనుభవించాడు.
903253 380981Thanks for providing such an excellent post, it was outstanding and really informative. Its my 1st time that I visit here. I located lots of informative stuff inside your write-up. Maintain it up. Thank you. 421243