Switch to English

బిగ్‌ షాక్‌: ఏపీలో ఈ రోజు సెంచరీ కొట్టిన కరోనా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సెంచరీ దాటేసింది. మొత్తంగా 102 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్యను 57గా చూపిస్తోంది. అదే సమయంలో, ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులు 45 అని విడిగా పేర్కొంటుండడం గమనార్హం. నిన్నటినుంచే ఈ విధానం అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

దేశంలోని వివిద రాష్ట్రాల నుంచి రాకపోకలు ప్రారంభమయిన దరిమిలా, ఆయా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొన్ని రాష్ట్రాలు ‘మైగ్రెంట్స్‌’ పేరుతో ప్రత్యేకంగా కేసుల వివరాల్ని ప్రకటిస్తున్నా, వాటి వివరాల్ని మొత్తం కేసులతో కలిపే చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. ఇదిలా వుంటే, తమిళనాడు కోయంబేడు మార్కెట్‌ తాలూకు ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ కేసుల్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నా, ఏపీ కేటగిరీలోనే వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ.

రాష్ట్రానికి సంబంధించి మొత్తం లెక్కలో ‘మైగ్రెంట్స్‌’ని పేర్కొనకపోతే, ఆ కేసులు దేశానికి చెందిన మొత్తం లెక్కలో కలుస్తాయా.? లేదా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇదే నిర్ణయం తీసుకుంటే.. లెక్కలు పూర్తిగా తప్పేస్తాయి. తెలంగాణలోనూ, ఇతర పొరుగు రాష్ట్రాల్లోనూ లేని విధానం ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు ఫాలో అవుతోందో ఏమో.. అధికార యంత్రాంగం వివరణ ఇవ్వాల్సి వుంది. ఇక, ఈ రోజు రాష్ట్రం చెబుతున్నదాన్నిబట్టి 57 కేసులు నమోదవడాన్ని పరిగణనలోకి తీసుకున్నా.. కేసుల సంఖ్య మళ్ళీ గణనీయంగా పెరుగుతున్నట్లే భావించాలేమో.

కర్నూలు జిల్లాలో నిన్న కొత్త కేసులు నమోదు కాకపోగా, ఈ రోజు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం జిల్లాలోనూ కొత్త కేసులు (3) నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో మాత్రం కొత్త కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. విశాఖపట్నంలో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. కోయంబేడు ఎఫెక్ట్‌తో చిత్తూరు జిల్లాలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏదిఏమైనా, మైగ్రెంట్స్‌ని కలుపుకుని రాష్ట్రంలో ఈ రోజు 102 కేసులు నమోదు కాగా.. కరోనా వైరస్‌కి సంబంధించి రాష్ట్రంలో ఒకే రోజు నమోదైన అతి ఎక్కువ కేసులు ఇవే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...