CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై భాగంలో సీఎంకు గాయం కావడంతో చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దాడిపై పోలీసులు (Police) విచారణ వేగవంతం చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈక్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
నిందితుల ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి ఇస్తామని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రకటించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు తెలిసినా.. ఏదైనా సమాచారం ఉన్నా తమకు తెలపాలని కోరారు. ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి రూ.2లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా పేర్కొన్నారు.
దాడికి పాల్పడిన వారి వివరాలు 94906 19342, 94406 27089 ఫోన్ నెంబర్లకు తెలపాలని కోరారు. మరోవైపు.. దాడిపై సీఎం జగన్ స్పందించారు. ఇటువంటి దాడులకు తాను భయపడేదిలేదని ప్రకటించారు. ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని అన్నారు.