Switch to English

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ చేసింది. ప్రస్తుతం అందరి దృష్టి ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ల పైనే ఉంది. చార్జ్ తీసుకున్నప్పటినుంచి అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వీరిద్దరిని చుట్టుముడుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు అధికార పార్టీ నేతలకే సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదులు వెళ్లాయి.

తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు లో ఎన్నికల కోడ్ కి విరుద్ధంగా వైసిపి శ్రేణులు మెప్మా ఆర్పీలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనిని అడ్డుకున్న టిడిపి నేతలపై అధికార పార్టీ నేతలు దాడికి తెగబడ్డారు. అంతేకాకుండా వారిపై డ్రగ్స్ చల్లి చిత్ర హింసలు పెట్టారు. ఈ విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం వివాదానికి దారితీసింది. వైసిపి నేతలపై నామ మాత్రపు కేసులు పెట్టి.. టిడిపి నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో కోకొల్లలు. ఎన్నికల సమయంలో పోలీసుల తీరు ఇలాగే ఉంటే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కూటమి పార్టీ నేతలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.

ఇక గత నెల 16న ఎన్నికల కోడ్ రావడంతోనే అందరి దృష్టి గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తే వాలంటీర్లపైనే పడింది. వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు నియమించుకున్న వారు కాబట్టి ఎన్నికల కోడ్ సమయంలో వారు పనిచేయడానికి వీల్లేదని ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించింది. ఏప్రిల్ నెలకి సంబంధించి సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ లోనూ వారిని భాగస్వాములను చేయలేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ తంతును ప్రభుత్వం నడిపించింది.

అయితే ఇంటింటికి సచివాలయ ఉద్యోగులు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని టిడిపి, జనసేన, బిజెపి కూటమి పార్టీల నేతలు కోరినప్పటికీ వారి అభ్యర్థనను సీఎస్ పక్కన పెట్టారు. వారికి ఎన్నికల విధులు ఉన్నందున ప్రజలే సచివాలయాల వద్దకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ఆర్డర్ కూడా పాస్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం పెద్ద కష్టమేమి కాదని అందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను కూడా ప్రతిపక్ష నేతలు సీఎస్ కి వివరించారు. అయితే, ఇంటికి పెన్షన్ తెచ్చి ఇవ్వాలంటే మళ్లీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే అధికారంలోకి రావాలన్న సందేశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో జవహర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శలు కూడా వచ్చాయి. వీటిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

బదిలీ వేటు పడే అధికారుల్లో బలంగా వినిపిస్తున్న మరో పేరు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతా రామాంజనేయులు. 2022లో చార్జ్ తీసుకున్న ఈయన.. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న అపవాదును మూట కట్టుకున్నారు. అన్ని శాఖలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ రిపోర్టులను ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు ఈయనపై బలంగా ఉన్నాయి. ప్రతిపక్ష నేతల కదలికలపై నిఘా ఉంచి ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారని ఇప్పటికి పలువురు ఆరోపిస్తున్నారు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ ముగ్గురి వివాదంపై స్పందించారు. వీరిపై వచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని, ఇందుకు సంబంధించిన రిపోర్టులను కూడా అందించామని, సీఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో వీరిపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...