Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: జగన్‌ కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోందెందుకంటే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణ ధనిక రాష్ట్రం. అయినాగానీ, తెలంగాణతో పోల్చి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలు విషయంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌.. శక్తికి మించి కష్టపడ్తోందన్నది నిర్వివాదాంశం. అయితే, సంక్షేమ పథకాల అమలులో కావొచ్చు.. ఇతరత్రా విషయాల్లో కావొచ్చు, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి డబ్బుల్ని వెదజల్లుతున్నప్పటికీ.. అధికార పార్టీ నేతల నిర్వాకంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.

విశాఖలో గ్యాస్‌ లీక్‌ వ్యవహారాన్నే తీసుకుంటే.. తక్కువ సమయంలోనే బాధిత కుటుంబాలకు భారీ స్థాయిలో పరిహారాన్ని అందజేయగలిగింది ప్రభుత్వం. ఇంకా కొందరికి పరిహారం అందాల్సి వున్నప్పటికీ.. గతంలో ఎన్నడూ లేని విధంగా మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం అందించడం గమనార్హం. కానీ, ఎక్కడో లోపం జరుగుతోంది.

బాధిత కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. బాధితుల్ని గుర్తించడంలో గ్రౌండ్‌ లెవల్‌లో తప్పులు దొర్లుతున్నాయి. అదే ప్రభుత్వానికి శాపంగా మారుతోంది. మంత్రులు, గ్యాస్‌ లీక్‌ అయిన ప్రాంతాల్లో బస చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ, దానికోసం ఫొటో, వీడియో షూట్‌లు చేయించుకోవడంతో అసలు ఉద్దేశ్యం నీరుగారిపోయింది.

పశువులకు గడ్డిపెట్టే విషయంలో కూడా ఫొటోల మీద ఫోకస్‌ పెట్టారు మంత్రులు. ఒక్క ఈ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో మంత్రుల అత్యుత్సాహం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది. అమరావతి విషయంలోనూ అంతే. మంత్రులే అనవసర రచ్చకు తెరలేపారు.

ఇక, సలహదారుల నుంచి కూడా సరైన సలహాలు ప్రభుత్వానికి అందడంలేదన్న విమర్శలున్నాయి. సరైన సమయంలో సరైన సలహాలు ప్రభుత్వానికి ఇచ్చేందుకే సలహాదారుల నియామకం జరుగుతున్నా.. సలహాదారుల్లో చాలామంది పూర్తిస్థాయిలో విఫలమవుతున్నారు. ‘మేమెందుకు సమాధానం చెబుతాం.? మాకేంటి సంబంధం.?’ అని ఓ సలహాదారుడు జాతీయ మీడియా చర్చ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు.. అందర్నీ విస్మయానికి గురిచేశాయి. సంబంధం లేకపోతే, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం ఎందుకు అందుకుంటున్నట్లు.? అన్న ప్రశ్న ప్రజల నుంచి రాకుండా వుంటుందా.?

ఇటు సలహాదారులు, అటు మంత్రులు.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటే, వారి మీద ముఖ్యమంత్రికి సైతం సరైన ‘పట్టు’ లేదనే అనుకోవాల్సి వస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైసీపీలో కొందరు నేతలు కూడా ఇదే విషయమై అంతర్గతంగా ఆవేదన చెందుతున్నారట. ‘జగన్‌ కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోంది..’ అంటూ పార్టీలోనే చర్చ జరుగుతున్న మాట నిజమైతే.. తక్షణం డ్యామేజీ కంట్రోల్‌ చర్యలకు ముఖ్యమంత్రి దిగాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

రాజకీయం

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

ఎక్కువ చదివినవి

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...