ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన రాయి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తగిలింది. అదే రాయి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా తగిలిందిట.!
ముఖ్యమంత్రి నుదుటి మీద తగిలిన గాయానికి తొలుత చిన్న ప్లాస్టర్ వేసి, ప్రచారం కొనసాగించి, ఆ తర్వాత ఆసుపత్రికి తరలించి, పెద్ద ప్లాస్టర్ వేసిన సంగతి తెలిసిందే. వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తీవ్ర గాయమైందంటూ, మొత్తంగా ఆ కన్ను మీదనే బ్యాండేజ్ వేసేశారు.!
జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందనీ, టీడీపీ కుట్రేననీ, జనసేనకీ ఈ కుట్రలో భాగం వుందనీ వైసీపీ మార్కు రాజకీయ విమర్శలు షురూ అయ్యాయి. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్న చందాన వైసీపీ చేస్తున్న ఈ రాజకీయ విష ప్రచారం బెడిసికొట్టింది.
ఇంకోపక్క, ఈ ఘటనతో టీడీపీకి సంబంధం వుందని చూపించేందుకు వైసీపీ నానా తంటాలూ పడుతోంది. ఈ ఘటనలో నిందితులుగా ఐదుగురు యువకుల్ని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుల తల్లిదండ్రులు, ‘ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రెండొందలు, మూడొందలు ఇచ్చి తమను తీసుకెళ్ళారనీ.. ఇప్పుడేమో డబ్బులు ఇవ్వకుండా కేసులు బనాయించారనీ’ మండిపడుతున్నారు.
ఇస్తామన్న డబ్బులు ఇవ్వకపోవడంతో, అందులో ఓ కుర్రాడు రాయి విసిరాడన్నది ప్రాథమికంగా తేలుతున్న అంశం. రాష్ట్రంలో రాజకీయ పరమైన ఇలాంటి దాడులకు సంబంధించి, పోలీసు వ్యవస్థ ఎప్పుడూ అధికార పార్టీకి వంత పాడటమే చూస్తున్నాం. ఎన్నికల కోడ్ అమల్లో వున్నా, పోలీసులు అదే పాట పాడుతారా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.
ఎన్నికల ప్రచారం కోసం జనాన్ని తీసుకొచ్చి, బల ప్రదర్శన చేసి.. చివరికి ఆ కూలీల మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం ఏం రాజకీయమో ఏమో.!
[url=https://filtrmarket.ru/]Фильтр воздушный компрессора[/url] предназначен для максимальной очистки воздуха от загрязнений. Обеспечивая высокую эффективность и надежность, он защищает ваш компрессор от пыли, масла и других частиц, обеспечивая бесперебойную работу и повышенную производительность.