సెల్ఫీ మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు కొందరైతే.. ప్రాణాలు పోగొట్టుకున్న వారూ ఉన్నారు. అయినా.. ‘సెల్ఫీ’ మోజు తీరడం లేదు. ‘సెల్పీ’ సరదా ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఓ యువతి సెల్ఫీ తీసుకునేందుకు బావి పైకి ఎక్కి అదుపుతప్పి బావిలో పడిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్ సుఖేడా గ్రామంలో నివసించే యువతి బావిపైకి ఎక్కి సెల్ఫీ తీసుకోవాలని భావించింది.
వెంటనే బావిపైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటూండగా కాలు జారి బావిలో పడిపోయింది. యువతి అరుపులు విన్న అటుగా వెళ్తున్న ఓ యువకుడు వెంటనే బావిలోకి దూకేశాడు. మొత్తానికి యువతిని రక్షించాడు. అయితే.. ఎలా పైకి రావాలో యువకుడికి కూడా అర్దం కాలేదు. వీరిద్దరూ కలిసి బావిలోనుంచే కాపాడాలంటూ అరవసాగారు. గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్థలు సాయంతో వారిద్దరినీ కాపాడారు. స్థానికంగా కలకలం రేపిందీ ఘటన.
463732 543685I truly like your writing style, good info, appreciate it for posting : D. 886055