కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టణంలో జరిగిన హత్య కలకలం రేపింది. హత్యకు గురైంది వైసీపీ నేత కావడం సంచలనమైంది. వైసీపీకి చెందిన మోకా భాస్కరరావును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మున్సిపల్ చేపల మార్కెట్ కు వెళ్లిన భాస్కరరావును కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ కత్తికి సైనైడ్ కూడా పూసి ఉండటం కలకలం రేపుతోంది. భాస్కరరావును వెంటనే ఆసుపత్రికి తరలించగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
తీవ్ర సంచలనం రేపిన ఈ హత్యలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. భాస్కరరావును దారుణంగా హతమార్చిన దుండగులిద్దరూ వెంటనే అక్కడినుంచి పరారయ్యారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ హత్య చేసినట్టు భాస్కరరావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. మున్సిపల్ మార్కెట్ చైర్మన్ గా భాస్కరరావు గతంలో పని చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
262539 57418This internet site is my breathing in, genuinely excellent layout and perfect content . 135575
66728 434738great post. Neer knew this, thanks for letting me know. 875212