‘మహర్షి’ సినిమాలో కనిపించి తన నటనతో మెప్పించిన అల్లరి నరేష్ హీరోగా చేస్తున్న సినిమా ‘నాంది’. ‘ఎ న్యూ బిగినింగ్’ అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. ఇప్పటికే రిలీజైన రియలిస్టిక్ ఫస్ట్ లుక్ అందరినీ షాక్ అయ్యేలా చేసింది. లాక్ డౌన్ టైంకి ఈ సినిమా 80% షూటింగ్ ని పూర్తి చేసుకుంది. జూన్ 30న అల్లరి నరేష్ బర్త్ డే కానుకగా ఉదయం 9 గంటల 18 నిమిషాలకి విజయ్ దేవరకొండ ఫస్ట్ ఇంపాక్ట్ ని రివీల్ చేయనున్నాడు.
ఇక్కడ వరకూ బాగానే ఉంది, మేము ఈ సినిమా గురించి ప్రత్యేక సమాచారం తెలుసుకున్నప్పుడు ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఈ చిత్ర నిర్మాత సతీష్ వేగేశ్న ‘నాంది’ కోసం 8 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు. ఇందులో షాకింగ్ ఏంటంటే ప్రస్తుతం అల్లరి నరేష్ సినిమాలకి అంత మార్కెట్ లేదు. మహర్షిని పక్కన పెడితే అల్లరి నటేష్ హీరోగా నటించిన గత నాలుగైదు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బాగా నిరాశపరిచాయి. దాంతో అల్లరి నరేష్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం అల్లరి నరేష్ మార్కెట్ 3 నుంచి 4 కోట్ల లోపే. అది కూడా సినిమాకి హిట్ టాక్ వస్తే.. ఇలాంటి సమయంలో అల్లరి నరేష్ మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టడం అనేది పెద్ద సాహసం.
ఒకవైపు మార్కెట్ లేదు, మరోవైపు లాక్ డౌన్ కారణంగా ఎప్పుడు థియేటర్స్ తెరుచుకుంటాయి? థియేటర్స్ కి జనం వస్తారా? లేదా? అన్నది మరో సమాధానం లేని ప్రశ్న. అదీకాక అల్లరి నరేష్ ఇమేజ్ కి తగ్గట్టు ఇదొక ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు.. సామాజిక అంశాలతో పాటు, క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తంతో చాలా డిఫరెంట్ సబ్జెక్టుతో రూపొందుతున్న సినిమా. ఇలా ఇన్ని సమస్యల నడుమ నిర్మాత సతీష్ వేగేశ్న మాత్రం ఏ మాత్రం సంకోచం లేకుండా 8 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నారు. మరి ఆయన స్క్రిప్ట్ మీద పెట్టుకున్న నమ్మకమా? ఈ సినిమా అతనికి లాభాలు తెచ్చిపెడుతుందా? అనే ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే.
వరలక్ష్మీ శరత్కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రియదర్శి, ప్రవీణ్ కీలక పాత్రధారులైన ఈ చిత్రం ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
828678 299795Some truly quality weblog posts on this internet web site , saved to my bookmarks . 388861
942999 767568You genuinely should experience a tournament for starters of the finest blogs online. Let me recommend this great site! 608447