Switch to English

లాక్ డౌన్ పొడిగింపుపై మోదీ మదిలో ఏముంది?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. దాదాపు 40 రోజులుగా లాక్ డౌన్ ఉన్నప్పటికీ దేశంలో కేసుల సంఖ్య తగ్గలేదు. ఇప్పటివరకు 33వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1074 మంది చనిపోయారు. నిజానికి ఈ లాక్ డౌన్ కాలంలో కేసుల సంఖ్య తగ్గుతుందని భావించారు. కానీ అలా జరగకుండా రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ గడువు సమీపిస్తోంది. మే 3తో లాక్ డౌన్ ముగియనుంది.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడిగిస్తారా లేక ఆంక్షలతో సడలిస్తారా అనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా తీరని నష్టం వాటిల్లుతోంది. లక్షలాది మంది ఉపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుని లాక్ డౌన్ ఎత్తివేస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. కానీ అటు ఆర్థిక వ్యవస్థ, ఇటు ప్రజల ప్రాణాలూ రెండూ తమకు ముఖ్యమేనని చెబుతున్న కేంద్రం ఇంకా ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ప్రధాని మోదీ మరోసారి మేరీ ప్యారీ దేశ్ వాసియో.. అంటూ ఎప్పుడు టీవీలో కనిపిస్తారా అని దేశం మొత్తం ఆతృతతో ఎదురు చూస్తోంది. ఇప్పటికే సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ.. లాక్ డౌన్ పై అందరి అభిప్రాయాలూ తీసుకున్నారు. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది.

లాక్ డౌన్ పొడిగింపుపై హాంగ్ కాంగ్ మోడల్ ను అనుసరించే అవకాశం ఉందని చెబుతున్నారు. చైనాకు పొరుగున ఉన్న హాంకాంగ్ లో జనవరి 23న తొలి కరోనా కేసు నమోదైంది. మార్చి 15 నాటికి వంద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య వెయ్యి దాటింది. ఇప్పటివరకు నలుగురు చనిపోయారు. లాక్ డౌన్ విధించకుండానే హాంకాంగ్ ఈ వైరస్ పై చక్కని నియంత్రణ సాధించింది. ఇందుకోసం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి.

ముందుగా వైరస్ సోకినవారిని ఎక్కడికక్కడ వెతికి పట్టుకుని మరీ క్వారంటైన్ చేసింది. ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేసింది. జనం బయట ఎక్కువగా తిరగకుండా ఆంక్షలు విధించింది. జనం సమూహాలుగా ఉండకుండా నిరోధించింది. మరోవైపు హాంకాంగ్ పౌరులు కూడా ప్రభుత్వానికి సహకరించారు. దీంతో కరోనా వైరస్ అక్కడ తీవ్రంగా వ్యాప్తి చెందలేదు. దీంతో ఇప్పుడు మన దేశంలో కూడా లాక్ డౌన్ ఎత్తివేసి ఆ మోడల్ అనుసరిస్తారనే చర్చ సాగుతుంది. కానీ భారత్ వంటి అధిక జనాభా కలిగిన దేశంలో ఇది వర్కవుట్ కాదని అంటున్నారు.

హాంకాంగ్ జనాభా 75 లక్షలు మాత్రమే. అలాంటిచోట్ల లాక్ డౌన్ లేకపోయినా కఠినమైన ఆంక్షల ద్వారా వైరస్ ను అదుపులోకి తెచ్చే వీలుంటుంది. కానీ 130 కోట్ల జనాభా కలిగిన మనదేశంలో అది అంత సత్ఫలితం ఇవ్వదని అంటున్నారు. మరోవైపు లాక్ డౌన్ పొడిగింపునకే కేంద్రం మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రీన్ జోన్ ప్రాంతాల్లో సడలింపులు ఇచ్చి, మిగిలిన ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగించడం ఖాయమని అంటున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

రాజకీయం

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

ఎక్కువ చదివినవి

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...