ఓవైపు దేశంలో కరోనా కేసులు తగ్గుతుంటే మహారాష్ట్రలో మాత్రం పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్కరోజే ఏకంగా 6281 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనం. ఈ పరిణామాలు యావత్ దేశాన్ని కలవరానికి గురి చేస్తోంది. దీంతో మహా ప్రభుత్వం స్పందించింది. అమరావతి సిటీ, అచలాపూర్ టౌన్లో వారం రోజుల లాక్డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం నుంచే ఈ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఈమేరకు అమరావతి గార్డియన్ మినిస్టర్ యశోమతి ఠాకూర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం అమరావతిలో శనివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ వీకెండ్ లాక్ డౌన్ అమల్లో ఉంది. పుణెలో రాత్రి కర్ఫ్యూ 11 నుంచి ఉదయం 6 గంటల వరకూ అమలు చేస్తున్నారు. ఈనెల 28 వరకూ జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసేయాలని జిల్లా యంత్రాగం ఆదేశించింది. ఆంక్షలు పాటించకుంటే మరోసారి లాక్డౌన్ తప్పదని సీఎం ఉద్ధవ్ థాకరే ప్రజలను హెచ్చరించారు.
733843 327806Thanks for the auspicious writeup. It in fact used to be a leisure account it. Glance complicated to more delivered agreeable from you! Nonetheless, how can we be in contact? 33179