దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ రాష్ట్రంలో ఈ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 6వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 110 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారిగా గతేడాది అక్టోబర్ 30న 6వేలకు పైగా కేసులు నమోదు కాగా.. శుక్రవారం ఒక్కరోజే 6,112 కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,87,632కి చేరింది.
కొత్తగా 44 మంది కరోనా బారిన పడి చనిపోగా.. ఇప్పటివరకు చనిపోయినవారి సంఖ్య 51,713కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,765 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఎన్సీపీ నేత, మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సేతోపాటు మంత్రి బచ్చు కడు రెండోసారి వైరస్ బారిన పడ్డారు. కాగా, చలి కారణంగానే వైరస్ వ్యాప్తి పెరిగినట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు చాలామంది మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం కూడా వైరస్ వ్యాప్తికి కారణాలని పేర్కొంటున్నారు.
985882 805625Ive read several excellent stuff here. Certainly value bookmarking for revisiting. I surprise how a lot effort you put to create one of these excellent informative web site. 734254