దేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. వైరస్ వీక్ అయ్యింది అనుకుంటూ కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల గతంతో పోల్చితే ఎక్కువగానే కేసులు నమోదు అవుతున్నాయి అంటూ ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. తాజాగా కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ లో భాగంగా ఏకంగా 33 మందికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
మొదటి రోజు 16 కేసులు నమోదు అవ్వగా తర్వాత రోజు 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఎక్కువ శాతం మందికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయినా కూడా లక్షణాలు బయట పడటం లేదు. దాంతో ఇన్ని రోజులు చాలా మంది కరోనాతోనే సహజీవనం సాగించారు. రెండు మూడు రోజుల్లో ఈ కేసుల సంఖ్య ఏకంగా 60 కు చేరే అవకాశం కూడా ఉందని వైధ్యాధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ఇలా క్యాంపులు పెట్టి పరీక్షలు నిర్వహిస్తే మరెంత మందికి పాజిటివ్ వస్తుందో అంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆదేశిస్తున్నారు.
539696 370832I think this is among the most vital info for me. And im glad reading your article. But wanna remark on few common points, The internet site style is perfect, the articles is genuinely great : D. Very good job, cheers 441895