అమెరికా మాజీ అధ్యక్షుడి ఖాతాలను ట్విట్టర్, ఫేస్ బుక్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనకో అవకాశం దక్కింది. ట్విట్టర్ను బ్యాన్ చేసిన నైజీరియా నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ను బ్యాన్ చేయాలంటూ నినదించారు.. ప్రపంచ దేశాలకూ పిలుపునిచ్చారు. ఫేస్బుక్, ట్విట్టర్లు ప్రజల వాక్స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. నియంతలు ప్రజల భావాలను నిర్ణయించడంపై మండిపడుతూ.. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ రెండింటినీ బ్యాన్ చేసుండాల్సిందని అభిప్రాయపడ్డారు.
ఈమేరకు ట్రంప్ కార్యాలయం నుంచి ఓ లేఖ విడుదలైంది. ‘నైజీరియాకు అభినందనలు. ట్విట్టర్ను బ్యాన్ చేస్తూ గొప్ప నిర్ణయం తీసుకున్నార. ట్విట్టర్, ఫేస్బుక్లు ప్రజల వాక్స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటున్నాయి. వీటిన మరిన్ని దేశాలు బ్యాన్ చేయాలి. వాళ్లేం నియంతలు కాదు ప్రజలను శాసించడానికి. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే బ్యాన్ చేయాల్సింది. జూకర్బర్గ్ నన్ను కలిసి వైట్ హౌస్కు విందుకు వస్తానన్నాడు. 2024లో జరుగుతుందేమో’ అని ట్రంప్ విడుదల చేసిన లేఖలో రాసుకొచ్చారు
628001 536527numerous thanks for telling!. Truth is generally the top vindication against slander. by Abraham Lincoln.. 93535