Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ ప్రభుత్వం వీటిని కొట్టి పారేస్తోంది. ఈక్రమంలో ల్యాండ్ టైటిలింగ్ తో తానూ ఇబ్బందులు ఎదుర్కొన్నానని రిటైర్ట్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ (PV Ramesh) సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏకంగా #LandTitlingAct హ్యాష్ ట్యాగ్ చేయడం విశేషం.
‘నేను ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. పోస్టులో పంపిన పత్రాలను తెరవకుండానే ఆర్డీవో తిరిగిచ్చేశారు. చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి. ఐఏఎస్ అధికారిగా 36ఏళ్లు రాష్ట్రానికి సర్వీస్ చేసిన నా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమని రమేశ్ చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది.
నేను #AndhraPradesh #LandTitlingAct ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి…
— Dr PV Ramesh (@RameshPV2010) May 6, 2024