Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి పవన్ కల్యాణ్ ను గెలిపించాల’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఈమేరకు ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘తల్లి కడుపున ఆఖరివాడిగా పుట్టినా.. అందరికీ మేలు చేయాలి.. మేలు జరగాలనే మనస్తత్వంలో మొదటివాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించే ఎక్కువగా ఆలోచించే వ్యక్తి నా తమ్ముడు పవన్ కల్యాణ్. అధికారంలోకి వచ్చాక సాయం చేస్తామనే వారిలా కాకుండా నా తమ్ముడు కౌలు రైతులు, జవాన్లు, మత్స్యకారులు.. ఇలా ఎవరికి సాయం చేయాలన్నా సొంత సంపాదనతోనే చేశాడు. కల్యాణ్ నిబద్ధత చూస్తే ఇటువంటి నాయకుడు కదా మనకి కావాలి అనిపిస్తుంది’.
సినిమాల్లోకి బలవంతంగా వచ్చిన కల్యాణ్.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడు. కానీ.. ఎన్నెన్నో మాటలు పడుతున్నాడు. అవి చూసి నా తల్లి.. అన్నగా నేనూ బాధ పడుతున్నాం. ఎందరో తల్లుల బిడ్డల భవిష్యత్ కోసం తమ్ముడు చేస్తున్న యుద్ధం ఇదని నమ్మాం. అన్యాయాన్ని ప్రశ్నించని వాళ్లవల్లే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని నమ్మి రాజకీయాల్లోకి వెళ్లిన శక్తిశాలి పవన్ కల్యాణ్. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తి ఉపయోగపడాలంటే చట్ట సభల్లో పవన్ కల్యాణ్ గొంతు వినిపించాల’ని చిరంజీవి ఆకాంక్షించారు.
జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి. pic.twitter.com/zifXEqt30t
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2024