Switch to English

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,850FansLike
57,764FollowersFollow

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా చిట్ చాట్ చేశారు. ఇరువురు కూడా తమ రాజకీయ నేపథ్యం మరియు ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, మోడీ గురించిన విషయాలను మాట్లాడుకున్నారు. ఎన్నికల వేల చిరంజీవి మరియు కిషన్ రెడ్డిల చిట్ చాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చిరంజీవి మాట్లాడుతూ… నేను శాసన సభ్యుడిగా తొలి సారి సభలో అడుగు పెట్టిన సమయంలో కొత్తగా అనిపించింది. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ, దుర్భాషలాడుకుంటూ లైవ్‌ లో తిట్టుకుంటూ ఉంటే నేను వారి భాషను విని షాక్ అయ్యాను. అసెంబ్లీ అంటే ఇలా ఉంటుందా అని ఆ సమయంలో అనిపించింది.

నాకు ఒక వైపు మీరు మరో వైపు జయప్రకాష్ నారాయణ గారు ఉండేవారు. నాకు తెలిసినంత వరకు మీరు అసెంబ్లీలో ఎప్పుడు కూడా దుర్బాషలాడలేదు. ఏదైనా పాయింట్‌ తీసుకుంటే దాని మీద సరిగ్గా మాట్లాడేవారు తప్ప ఇతర విషయాల గురించి మాట్లాడుతూ పాయింట్‌ తప్పేవారు కాదు. సభా మర్యాద అనేది మీ నుంచి నేర్చుకున్నాను.

నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రేణిగుంటలో కలనరీ ఇన్సిస్టిట్యూట్‌ ను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు అహ్లూవాలియా ను కోరడం జరిగింది. కానీ ఆయన అందుకు ఆసక్తి చూపించలేదు. నేను పలు సార్లు సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాత దానికి అనుమతి వచ్చింది. ఈ లోపు రాష్ట్ర విభజన జరగడం, నేను మంత్రిగా రాజీనామా చేయడం వంటివి జరిగాయి. ఆ ప్రాజెక్ట్‌ అక్కడే ఆగుతుందని అనుకున్నాను. కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఆ ప్రాజెక్ట్‌ పూర్తి అయ్యింది అన్నారు.

కరోనా సమయంలో సినీ పరిశ్రమకు నావంతు సాయం చేశాను. అభిమానుల సహకారంతో ఎంతో మందికి అండగా నిలిచాం. కశ్మీర్‌ లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. అయితే ఆ సమయంలో నేను రాలేక పోవడంతో చరణ్ ను పంపించాను అన్నారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు మోడీ తో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. అద్వానీ గారు యువ నాయకులను అమెరికాకు పంపించాల్సి వచ్చినప్పుడు ఏపీ నుంచి నన్ను గుజరాత్‌ నుంచి మోడీ గారిని మరి కొంత మందిని పంపించడం జరిగింది. అప్పట్టి జ్ఞాపకాల తాలుకు ఫోటోలు ఇంకా నా వద్ద ఉన్నాయి.

మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశం లో అనేక విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేయడం జరిగింది. ఆర్టికల్‌ 370 రద్దు అనేది దేశ చరిత్రలో అత్యంత కీలక పరిణామం. 370 రద్దు తర్వాత కశ్మీర్ లో ఇప్పటి వరకు 300 సినిమాలకు పైగా షూటింగ్‌ జరుపుకున్నాయి అన్నారు. ఇంకా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలను చిరంజీవితో కిషన్ రెడ్డి పంచుకున్నారు.

2 COMMENTS

సినిమా

ఇస్మార్ట్ నభా స్పైసీ ట్రీట్..!

టాలెంట్ ఉండి లక్ తగలక కెరీర్ లో వెనకపడే హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఉంటుంది. స్టార్...

మోహన్ బాబు బర్త్ డే.. కన్నప్ప నుంచి సర్ ప్రైజ్..!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా కన్నప్ప. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ...

ప్రియదర్శి “సారంగపాణి జాతకం” రిలీజ్ డేట్ ఫిక్స్..

రీసెంట్ గానే మంచి హిట్ అందుకున్న ప్రియదర్శి త్వరలోనే మరో సినిమాతో రాబోతున్నాడు. హిట్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్...

కిరణ్ అబ్బవరం చేసిన తెలివైన పని ఏంటో తెలుసా…

క మూవీతో తిరిగి ఫాంలోకి వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా దిల్ రూబాతో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వ...

సమంత కు ఏమైందీ!?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సిటాడెల్ వెబ్ సీరీస్ తో...

రాజకీయం

త్వరలో గుడ్‌ న్యూస్ వింటారు : లోకేష్‌

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు...

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం : నారా లోకేష్..!

ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై వాస్తవాలను చెబుతున్నా కూడా వైసీపీ వినే పరిస్థితి లేదని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై వైసీపీ...

విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు కూటమి ప్రయత్నం.. మొదటిసారి ట్రూడౌన్..!

ట్రూడౌన్.. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధానం. ఇది గత ఐదేళ్లలో ఎన్నడూ వినిపించలేదు. ఎంత సేపు ట్రూ అప్ మాత్రమే వినిపించింది. ట్రూ అప్ అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప...

టీడీపీ, జనసేన.. ఆల్ ఈజ్ వెల్.! కండిషన్స్ అప్లయ్.!

జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ వేదికపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ‘కర్మ’ వ్యాఖ్యలు, పిఠాపురం టీడీపీ నేత వర్మ అభిమానులకి అస్సలు నచ్చలేదు. దాంతో,...

ప్రతిసారీ ప్రకాష్ రాజ్ ఎందుకు ఎగేసుకుంటూ వస్తున్నట్టు.?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్‌కి కూడా అత్యంత సన్నిహితుడే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో, ప్రకాష్ రాజ్ తరఫున బలంగా నిలబడ్డారు నాగబాబు. మరి, ప్రకాష్...

ఎక్కువ చదివినవి

చంద్రబాబుని ఏకాకిని చేద్దామనుకున్న జగన్.! తానే చివరికి ఏకాకిగా మిగిలిపోయె.!

చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో, ఆయన్ని ఏకాకిగా మార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయాల్లో రాజకీయ యెత్తుగడల్ని తప్పు పట్టలేంగానీ.. వైఎస్ జగన్ అనుసరించిన...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

వైకాపా ఫీజు పోరుపై లోకేష్ ధ్వజం

శాసన మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులపై వైకాపా వాయిదా తీర్మానానికి పట్టుబట్టింది. మండలి ఛైర్మన్‌ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో వైకాపా సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. ఛైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు....

దేశానికి ఉపయోగపడేలా పవన్ ఎదగాలి : నాదెండ్ల మనోహర్

పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన జయకేతనంగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో పార్టీ నేతలంతా పవన్ తో పనిచేస్తున్న సమయంలో తాము పొందిన అనుభూతి ఆయన విధి విధానాల గురించి...

వైఎస్సార్సీపీ యువత పోరు.! భలే కామెడీ అయిపోయింది.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘యువత పోరు’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నిజానికి, గతంలోనే జరగాల్సిన కార్యక్రమం ఇది. విపక్షం అన్నాక, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం...