Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఓటర్లను చేరేందుకు ప్రధాన పార్టీలు అన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి పార్టీ కూడా సోషల్ మీడియా ప్రచారం కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నాయి.
ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు పై అభిమానంతో డాక్టర్ వెంకీ మేడసాని ఏకంగా ‘తెలుగోడు’ అనే సినిమాను రూపొందించారు. చంద్రబాబు నాయుడు జీవితం అందరికి తెరిచిన పుస్తకం. ఆయన జీవితం గురించి, ఆయన రాజకీయ జీవితం మరియు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కార్యక్రమాల గురించి అందరికి తెల్సిందే.
చంద్రబాబు నాయుడు జీవితంలోని ముఖ్య సంఘటనలను తీసుకుని చిత్ర సీమలో ఎటువంటి నేపథ్యం, అనుభవం లేని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ వెంకీ మేడసాని సినిమాను రూపొందించారు. ఆయన చెప్పాలి అనుకున్న విషయాలను ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా సింపుల్ గా ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్పాడు.
సినిమా విడుదల సందర్భంగా దర్శక నిర్మాత అయిన వెంకీ మేడసాని మాట్లాడుతూ… చంద్రబాబు గారి జీవితంలో, ఆయన పరిపాలనలో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల జీవితాలు మారాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాలు గడిచినా పల్లెటూరి ప్రజల జీవితాలు మారలేదు. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కారణంగా నగరాలకు వచ్చిన పల్లె ప్రజలు ఉన్నతమైన జీవితం సాగిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు. సమాజంలో వచ్చిన మార్పు కూడా! ఎటువంటి సామజిక అసమానతలు లేకుండా అందరూ ఒక్కటిగా బతుకుతున్నారు. ఆ పాయింట్ మీద సినిమా తీశా” అని చెప్పారు.