Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ – జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి పిఠాపురం ప్రచారానికి వెళ్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. స్థానికంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇప్పటికే జనసేనకు 5కోట్లు విరాళం, పలువురు నేతలకు సంఘీభావం ప్రకటించిన చిరంజీవి పిఠాపురం వెళ్ళి పవన్ కు అండగా నిలిస్తే మెగాభిమానులు, జనసేన శ్రేణులు, పవన్ అభిమానుల్లో జోష్ రావడం ఖాయం.
ఈక్రమంలో మే 10న విజయవాడ వెళ్ళి 11న చంద్రబాబును కూడా కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
వీటన్నింటిపై పూర్తి అధికారిక సమాచారం రావల్సి ఉంది. ఈ వార్తలు నిజమైతే జనసెనకు మెగా అండ లభించినట్టే..!