రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డ్వాక్రా మహిళల పొదుపు చేసుకున్న అభయహస్తం నిధులను తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మంత్రులు హరీశ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21లక్షల మంది డ్వాక్రా మహిళలకు లబ్ది చేకూరనుంది. ఇప్పటివరకూ వారు 545 కోట్లు పొదుపు చేసుకున్నారు. గతంలో వారు అభయ హస్తం కింద 500 కాంట్రిబ్యూటరీ పెన్షన్ కింద పొదుపు చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఆసరా పధకం కింద మొదట్లో వెయ్యి.. ఆ తర్వాత 2016 పెన్షన్ గా ఇస్తోంది ప్రభుత్వం.
దీంతో పెన్షన్ ఎక్కువ వస్తూండటంతో తమకు అభయ హస్తం డబ్బులు కావాలని అడగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పేదరిక నిర్మూలన సంస్థ వద్ద ఉన్న ఈ మొత్తం రెండు, మూడు రోజుల్లోనే ఆయా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
552467 863878As soon as I detected this internet web site I went on reddit to share some of the love with them. 105113