కర్ణాటక మైసూరు జిల్లా చిల్కుంద గ్రామంలో దారుణం జరిగింది. గత కొన్నాళ్లుగా ఆ గ్రామానికి చెందిన యువతి అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె మానసికంగా కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్ చుట్టు తిప్పి ప్రయోజనం లేకపోవడంతో చేసేది లేక జబీవుల్లా అనే స్వామిజీ వద్దకు తీసుకు వెళ్లారు. ఆయన అమ్మాయిపై దెయ్యం ఉంది. ఆ దెయ్యంను తొలగిస్తే తప్ప ఆమె ఆరోగ్యం బాగు అవ్వదు అన్నాడు. స్వామిజీ మాటలు నమ్మి దెయ్యం పోగొట్టేందుకు పూజకు ఏర్పాట్లు చేశారు.
ఆమెపై ఉన్న దెయ్యం బయటకు వచ్చిన సమయంలో దగ్గర్లో ఎవరు ఉంటే వారిపైకి వెళ్లుందని, అందుకే సమీపంలో ఉండవద్దు అంటూ అందరిని అక్కడ నుండి పంపించేశాడు. ఆమెతో ఒంటరిగా పూజ చేసి విభూది నీటితో స్నానం చేయించాలనే వంకతో ఆమె డ్రస్ తొలగించి ఆపై అత్యాచారం చేశాడట. ఈ విషయం అమ్మాయి తండ్రితో చెప్పడంతో నెత్తి నోరు కొట్టుకున్న ఆ తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి స్వామిజీ బండారం బయట పెట్టాడు. ఈ విషయం స్థానికంగా సంచలనం సృష్టించింది. దొంగ బాబాను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
477106 173416You produced some decent points there. I looked online to the problem and discovered a lot of people is going in addition to using your web site. 551514
645727 457312I enjoy the helpful info you provide inside your articles. 718064