మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సూపర్ హిట్ చిత్రం ‘లూసిఫర్’ ను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లుగా చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. చిరంజీవి కోసం ఇప్పటికు సాహో దర్శకుడు సుజీత్ స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా వస్తున్న ఈ వార్తలను మెగా కాంపౌండ్ కాని సుజీత్ కాని కొట్టి పారేయక పోవడంతో లూసిఫర్ రీమేక్ కన్ఫర్మ్ అంటూ మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
లూసిఫర్ సినిమా స్క్రిప్ట్లో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారట. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ మరియు కాస్త మాస్ మసాలా అంశాలను ఈ చిత్రంలో జోడివ్వాలని భావిస్తున్నారు. ఐటెం సాంగ్ తో పాటు హీరోకు హీరోయిన్ ఇలా కొన్ని హంగులను అద్దుతున్నారు. పరుచూరి బ్రదర్స్ ఈ రీమేక్ స్క్రిప్ట్ కు తమ పెన్ను పెట్టినట్లుగా తెలుస్తోంది. కమర్షియల్ మూవీగా మార్చడంతో పాటు మెయిన్ స్టోరీని ఏమాత్రం డిస్ట్రబ్ చేయకుండా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట.
చిరంజీవి ఈ లాక్ డౌన్ తర్వాత ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆచార్య పూర్తి అయిన తర్వాత విడుదలకు ముందే లూసిఫర్ సినిమా రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించబోతున్నాడు. చరణ్ తో పాటు మరో ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతుందట. త్వరలోనే ఈ రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
306645 521831really nice post, i in fact really like this internet site, carry on it 993002