ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినదాని ప్రకారం లాక్ డౌన్ ఇంకా కొనసాగించే వీలుంది. దీంతో ఇప్పటిదాకా పెళ్లిళ్లు వాయిదా వేసుకుని వచ్చిన వాళ్ళు ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సామాజిక దూరం పాటిస్తూ పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు.
పెళ్లిళ్లలో ప్రతీ ఒక్కరికి మాస్క్ లు, శానిటైజర్ల వాడకాన్ని కచ్చితం చేస్తున్నారు. టాలీవుడ్ లోనే రీసెంట్ గా ఇలాంటి నిబంధనలతో మూడు పెళ్లిళ్లు జరిగిన విషయం తెల్సిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు, యంగ్ హీరో నిఖిల్, రంగస్థలం ఫేమ్ మహేష్ ఇలా సామాజిక దూరం పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకున్నారు.
సామాన్యులు కూడా ఇదే పద్దతిలో పెళ్లిళ్లు వాయిదా వేసుకోలేని వారు తంతు కానిచ్చేస్తున్నారు. ఇక మాములుగా చేసుకుంటే పెళ్లిలో విశేషమేముంది. తమ గురించి అందరూ మాట్లాడుకోవాలి అనుకున్నారో ఏమో, ఇలాంటి పెళ్లిళ్లలో కూడా భారీతనం కోసం పాకులాడుతున్నారు. మాములుగా అయితే అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసేవారికి ఇప్పుడా అవకాశం దొరకట్లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే తమ డాబు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పెళ్లిళ్లలో ధరించే మాస్కులు వెండివి కొనుగోలు చేస్తున్నారు. వెండి మాస్కులు ధరించి అందరి ముందూ తమ గొప్పలు చూపించుకుంటున్నారు. ఈ రకమైన పెళ్లిళ్లు ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్రలో జరుగుతున్న పెళ్లిళ్లలో ఉంటున్నాయని తెలుస్తోంది. ఈ మాస్కులు 2,500 రూపాయల నుండి మూడు వేల దాకా పలుకుతున్నాయట.
252947 240433Some times its a discomfort in the ass to read what people wrote but this web web site is quite user friendly ! . 639880
896196 327774Totally composed content material , Genuinely enjoyed examining . 834360
336001 823071Some truly exceptional articles on this internet site , thankyou for contribution. 217181