Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘చోటీ సోచ్’ పేరుతో ఓ కంపెనీ.. ‘ప్రతి ఒక్కరూ తామ దైవంలా భావిస్తారు.. ఇతరులూ గౌరవించాల’నే సందేశంతో యాడ్ విడుదల చేసింది. ఓ మహిళ బ్యూటిషియన్ గా పనిచేస్తూ కారు కొనుగోలు చేస్తుంది. అయితే.. చుట్టుపక్కవారు ఆమె వృత్తిని చులకనగా చూస్తారు. ఆమె తమ్ముడు అవమానంగా భావిస్తాడు. దీనికి ఆమె.. ‘నేను కొన్న కారునే చూస్తున్నారు. నా కష్టం చూడట్లేదు. మహిళ విజయం సాధిస్తే సమాజం ఇలానే చూస్తోంది. మన జీవితాన్ని వదులుకోవాలా.. ముందుకుసాగాలా అనేది మన నిర్ణయ’మే అంటుంది.
దీనికి సానియా స్పందిస్తూ.. ‘డబ్ల్యూటీఏ టైటిల్ సాధించిన తొలి భారతీయురాలిని. డబుల్స్ లో ప్రపంచ నెంబర్ వన్. ఆరు గ్రాండ్ స్లామ్స్. అయినా.. ఈ సమాజానికి సరిపోలేదు. నేనెప్పుడు జీవితంలో స్ధిరపడతాననే చూశారు. మహిళ విజయాల్ని ఎందుకు పట్టించుకోరనేది అర్ధం కాదు. ఈ యాడ్ చూసిన తర్వాత నాలో ఎన్నో సందేహాలు తలెత్తాయి. మహిళలు సాధిస్తున్న విజయాలను మనం ఎలా చూస్తున్నామో ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంద’ని అన్నారు.
In 2005, I was the first Indian woman to win a WTA title. Big deal, right? When I was world no. 1 in doubles, people were keen to know when I’d settle down. Winning six grand slams isn’t settled enough for society. I’m grateful for the support I’ve received along the way, but… https://t.co/PGfSvAMgFd
— Sania Mirza (@MirzaSania) March 1, 2024