Pawan Kalyan: తాగునీరు అడిగినందుకు మహిళను చంపేస్తారా..? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. మండిపడ్డారు. వైసీపీ నేతల దురాగతాలు రోజురోజుకీ పెరిగి పోతున్నాయని మండిపడ్డారు. తాగునీరు అడిగిన మహిళను వైసీపీ సర్పంచ్ అనుచరుడు ట్రాక్టర్ తో ఢీకొట్టిన ఘటనపై అయన తీవ్రంగా స్పందించారు.
సామినిబాయి అనే మహిళ మంచినీళ్లు అడగటమే ఆమె తప్పు అయింది. తాగునీటి విషయంలో కూడా పార్టీలు చూసే సంస్కృతి రావడం దురదృష్టకరం. నీళ్ళు లేవని ప్రాధేయపడినా కూడా ట్రాక్టర్ తో ఢీకొట్టడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలి. నా ఎస్సీలు.. నా ఎస్టీలు అని మాట్లాడే వ్యక్తికి ఇప్పుడా అర్హత ఉందా..?
‘ఇటువంటి పాలకులు మళ్లీ వస్తే వైసీపీ వాళ్ళే నీళ్ళు తాగాలి.. వైసీపీ వాళ్ళే గాలి పీల్చాలి.. అని జీవో ఇస్తారేమో..? దీనికేం పాలకులు ఏం సమాధానం చెప్తారు..? పోలీసులు ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాల’ని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
తాగేందుకు నీళ్ళు అడిగితే చంపేస్తారా?
• పంచ భూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోంది – JanaSena Chief Shri @PawanKalyan#NeekokkaChanceisthe#HelloAP_ByeByeYCP pic.twitter.com/5QRdYyKR1I
— JanaSena Party (@JanaSenaParty) March 2, 2024