ఏపీ సీఎం జగన్ తనపై అసత్య ఆరోపణలు చేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ కోర్టులో రిజాయిండర్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రఘురామ రిజాయిండర్ దాఖలు చేశారు. కౌంటర్ లో జగన్ అసత్య ఆరోపణలు చేశారని.. తనకు పిటిషన్ వేసే అర్హత లేదనడం అసంబద్ధమని స్పష్టంచేశారు. పిటిషన్ విచారణార్హతపై ఇప్పటికే కోర్టులు స్పష్టత ఇచ్చాయన్నారు. తనపై కేవలం ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని.. చార్జిషీట్లు కాదని పేర్కొన్నారు. ‘జగన్ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి.
ఈ పిటిషన్ పై విచారణకు, నాపై ఉన్న కేసులకు సంబంధం లేదు. నాపై అనర్హత వేటుకు, ఈ పిటిషన్ కు సంబంధం లేదు. సీబీఐలోని కొందరు వ్యక్తులు కేసును ప్రభావితం చేస్తున్నారు. అందువల్లే సీబీఐ ఎలాంటి వైఖరీ వెల్లడించడంలేదు. ప్రచారం కోసమే పిటిషన్ వేశానన్న ఆరోపణలు నిరాధారం. నేను పిటిషన్ వేయగానే సీఐడీ నాపై కేసు నమోదు చేసింది. చట్టవిరుద్ధంగా నన్ను అరెస్టు చేసి వేధించారు’ అని రిజాయిండర్ లో వివరించారు. దీనిపై వాదనలకు సమయం ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టును కోరడంతో న్యాయస్థానం తదుపరి విచారణను జూలై ఒకటో తేదీకి వాయిదా వేసింది.
681923 276986Id have to speak to you here. Which isnt something Which i do! I enjoy to reading a post that really should get folks to feel. Also, thank you for permitting me to comment! 378968
443326 140778Properly, that is fantastic, however consider further options weve got here? Could you mind submitting an additional post relating to them also? Many thanks! 25799
551490 37402Merely wanna state that this is extremely beneficial , Thanks for taking your time to write this. 174406