అందాల భామగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది గ్లామర్ భామ రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో హిట్ అందుకుని ఆ తరువాత వరుస సినిమాలను పట్టేసింది. వరుసగా తెలుగులో సినిమాలు చేస్తుండడంతో ముంబై నుండి తన మకాం ని హైద్రాబాద్ కు మార్చేసింది.
అప్పుడప్పుడు ముంబై, చెన్నై కి వెళుతూ అక్కడ సినిమాలు చేస్తుంది. ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో కాస్త టెన్షన్ మీదున్న రాశి కాస్త గ్యాప్ తీసుకుని డైట్ పాటించి స్లిమ్ గా మారింది. రాశీ ఖన్నా స్లిమ్ అవ్వడంతో ఆమెకు మళ్ళీ అవకాశాలు క్యూ కట్టాయి .
ప్రస్తుతం తెలుగులో వెంకీ మామ సినిమాలో నటిస్తుంది. దాంతో పాటు రవితేజ సరసన ఓ సినిమాలో నటిస్తున్న రాశీ ఖన్నా లేటెస్ట్ గా తన మకాం ని ముంబై కి షిఫ్ట్ చేసే ప్రయత్నాల్లో ఉందట. ఇప్పడు తమిళంలో కూడా పెద్దగా అవకాశాలు లేవు .. దానికితోడు తెలుగులో కూడా బాగా క్రేజ్ తగ్గిందని భావించిన ఈ అమ్మడు ముంబై షిఫ్ట్ అయి అక్కడే హిందీలో ప్రయత్నాలు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నదట !!
ప్రస్తుతం గచ్చిబౌలి లో సొంత ఇల్లు కొనుక్కున్న రాశి ప్రస్తుతం ఆ ఇంటిని రెంట్ కు ఇచ్చేసి ముంబై వెళ్లేందుకు రెడీ అయింది. ఇక్కడ ఛాన్సులు తగ్గడంతోనే ఈ అమ్మడు ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నాయి ఫిలిం వర్గాలు. సో ముంబై లో ఉంది .. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రయత్నాలు చేయాలనీ చూస్తోందట !!