Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత కాలంగా రాధిక అక్కడ ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ఉన్నారు.
తమిళనాడులో మొదటి దశలోనే పార్లమెంట్ ఎన్నికలు జరుగబోతున్నాయి. అందులో భాగంగా అక్కడ నామినేషన్ పక్రియ ప్రారంభం అయ్యింది. తాజాగా రాధిక సోమవారం తన నామినేషన్ ను దాఖలు చేశారు. నామినేషన్ వేసిన సమయంలో రాధిక తన ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించారు.
ఎన్నికల కమీషన్ కి ఇచ్చిన వివరాల్లో తనకు 53.45 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని పేర్కొంది. 33.01 లక్షల రూపాయల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి వస్తువులు ఉన్నాయని పేర్కొంది. మొత్తంగా 27.05 కోట్ల చరాస్తులు, 26.40 స్థిరాస్తులు ఉన్నాయని ఆమె ప్రకటించారు. రూ.14.79 కోట్ల అప్పులు ఉన్నట్లుగా తెలియజేసింది.
రాడాన్ మీడియా బ్యానర్ లో సుదీర్ఘ కాలంగా సినిమాలు, సీరియల్స్ నిర్మించడంతో పాటు ఇంకా కూడా సినిమాల్లో సీరియల్స్ లో నటిస్తున్న రాధిక ఆస్తులు వంద కోట్లు కూడా లేక పోవడం విడ్డూరంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాట బీజేపీ బలం అంతంత మాత్రమే. కానీ రాధిక కి మంచి క్రేజ్ ఉంది. మరి ఈ ఎన్నికల్లో ఆమె గెలిచి పార్లమెంట్ కు వెళ్లనుందా అనేది చూడాలి.