Bangalore: అక్రమంగా డబ్బు సంపాదించేందుకు అక్రమార్కులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇందుకు లక్ష్యంగా వాహనదారులను లక్ష్యంగా చేసుకున్నారు. వాహనాల టైర్లకు పంచర్లు (Puncture) అయ్యేలా చూడటం వీరి పని. ఈరకంగా అడ్డదారుల్లో వెళ్తూ కొత్త దందాకు తెరలేపారు. బెంగళూరు (Bangalore) మహానగరంలో జరుగుతున్న పంక్చర్ మాఫియా (Nail mafia) వివరాల్లోకి వెళ్తే..
బెంగళూరు నగరంలో కొత్త మాఫియా పుట్టుకొచ్చింది. నగరవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ పంక్చర్ మాఫియా నగరావాసుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో వారి సమయం, డబ్బు కూడా వృధా అవుతున్నాయి. పంక్చర్ షాప్ కు కిలోమీటర్ పరిధిలో చిన్న మేకులు, తీగలు, అతిచిన్న ఇనుప చువ్వలు పడేస్తారు. ఇవి గుచ్చుకుని టైర్లు, ట్యూబులు పంక్చర్లు అవుతున్నాయి.
దీంతో పోలిస్ స్టేషన్లో ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. అశోక్ నగర, ఆనేపాళ్య, నంజప్ప, ఆపేరా జంక్షన్ తోపాటు అనేక ప్రాంతాల్లో పోలీసులు వీటిని సేకరిస్తున్నారు. దీంతో బెంగళూరు ప్రజలు ఎక్కడ తమ వాహనాల టైర్లకు పంక్చర్లు పడతాయోనని ఎంతో జాగ్రత్తగా వాహనాలు నడపాల్సి వస్తోంది.