ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రాను పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఘటన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన మిశ్రా ఫోన్ స్విచ్చాఫ్ చేసినా సోషల్ మీడియా, క్రెడిట్ కార్డుల వినియోగం ద్వారా ఆచూకీ తెలుసుకున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు.. ఆమెరికా ఆర్ధిక సేవల సంస్థ వెల్స్ పార్గో భారత విభాగానికి ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్న శంకర్ మిశ్రాను సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది.
నవంబరు 26న జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఎయిరిండియా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న నలుగురు క్యాబిన్ సిబ్బంది, ఒక ఫైలట్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసి విచారణ ముగిసేవరకూ విధుల్లోంచి తొలగించింది. ఈమేరకు ఘటనపై సంస్థ సీఈఓ క్యాంబెల్ క్షమాపణలు చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే ఉద్యోగులపై చర్యలకు మేం కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరక్కుండా విమాన సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
500492 6351This web site is my aspiration , extremely amazing pattern and perfect articles . 246856
56129 467370I real delighted to locate this site on bing, just what I was searching for : D also bookmarked . 99051
363177 636807Quite intriguing subject , regards for putting up. 318419
212774 555480Outstanding read, I just passed this onto a colleague who was performing a bit research on that. And he really bought me lunch because I discovered it for him smile So let me rephrase that. 625753