ట్విట్టర్ కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ కాంప్లెక్స్ లో జూన్ 18న సాయంత్రం 4 గంటలకు జరిగే విచారణకు హాజరు కావాలని పేర్కొంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనల అమలుపై ఈ సమావేశం జరగనుంది. సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళల భద్రతకు రక్షణ.. అంశాలపై ట్విట్టర్ ప్రతినిధి నుంచి అభిప్రాయాలను పార్లమెంటరీ కమిటీ తీసుకోనుందని తెలిపింది.
నూతన ఐటీ చట్టాలను ట్విట్టర్ అమలు చేయాలని కేంద్రం కొన్నాళ్ల క్రితమే ట్విట్టర్ కు నోటీసులు ఇచ్చింది. దీనిపై ట్విట్టర్ భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచింది. ట్విట్టర్ నుంచి సమాధానం రాకపోవడంతో చివరి అవకాశం ఇచ్చింది. దీంతో ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అంగీకరించింది. భారత ప్రభుత్వం చెప్పిన నిబంధనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. నూతన చట్టాల ప్రకారం చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్ ను నియమించాల్సి ఉంది. రెసిడెంట్ త్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాంటాక్ట్ అధికారులను భారతీయులను నియమించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.
760130 347458Fascinating point of view. Im curious to feel what type of impact this would have globally? Sometimes folks get a little upset with global expansion. Ill be around soon to take a look at your response. 330960
91574 290491This internet page is truly a walk-through its the internet you desired with this and didnt know who want to. Glimpse here, and you will certainly discover it. 723865