తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో నివాసం ఉండే కర్రి వెంకట రెడ్డి మరియు ఆయన భార్య సావిత్రిలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూడా కరోనా బారిన పడ్డట్లుగా ఇటీవలే రిపోర్ట్ వచ్చింది. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఇద్దరు కూడా ఇంటి వద్దే ఉండి పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. వారి ఆరోగ్యం మరింతగా విషమించడం జరిగింది. ఇద్దరు పిల్లలకు తాము భారం అవ్వొద్దు అనే ఉద్దేశ్యంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.
ఇంట్లో వృద్దుల అలికిడి లేక పోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోనికి వెళ్లి చూడగా లేకపోవడంతో రాజమహేంద్రవరంలో ఉండే కొడుక్కు మరియు జైపూర్ లో ఉండే మరో కొడుక్కు సమాచారం అందించారు. వారు హుటా హుటిన వచ్చి చుట్టు పక్కల వెతకగా వారి మృత దేహాలు మండ పేట కాలువలో లభించాయి. దాంతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్థారణ అయ్యింది. పిల్లలకు తమ వల్ల ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.
857856 526449Yay google is my king aided me to locate this excellent internet site ! . 421692
803783 582415Howdy! I just wish to give a huge thumbs up for the wonderful info you may have here on this post. I will probably be coming back to your weblog for far more soon. 189984