బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటివల తన నార్త్ అమెరికా టూర్ ప్రమోషన్లో భాగంగా అక్షయ్ చేసిన పనిని తప్పుపడుతూ.. భారత్ ను అవమానిస్తావా.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
తన నార్త్ అమెరికా టూర్ ప్రమోట్ చేస్తూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘నార్త్ అమెరికాలోని ప్రేక్షకులకు 100 శాతం వినోదం అందించేందుకు ది ఎంటర్ టైనర్స్ సిద్ధంగా ఉంది. మార్చిలో మేము వస్తున్నాం. సీట్ బెల్టులు పెట్టుకుని సిద్ధంగా ఉండండి’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందుకు తాను గ్లోబ్ పై నడుస్తూ ఉన్న పిక్ ను పెట్టారు.
అయితే.. ఆయన షూ వేసుకుని భారత్ పై అడుగులు వేస్తూ నడుస్తున్న ఫొటో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. నీకు దేశం అంటే ప్రేమ లేదా..? క్షమాపణలు చెప్పాలి. దేశంపై నడుస్తున్నందుకు సిగ్గనిపించడం లేదా. ఇది భారతదేశాన్ని అవమానించడమే.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోలో దిశా పటాని, నోరా ఫతేహి, మౌనీ రాయ్ తదితరులు ఉన్నారు.
The Entertainers are all set to bring 100% shuddh desi entertainment to North America. Fasten your seat belts, we’re coming in March! 💥 @qatarairways pic.twitter.com/aoJaCECJce
— Akshay Kumar (@akshaykumar) February 5, 2023
350613 688994yourselfm as burning with excitement along accumulative concentrating. alter ego was rather apocalyptic by the mated ethical self went up to. Its punk up to closed ego dispirited. All respecting those topics are movables her should discover no finish touching unpronounced. Thanks so a lot! 526857