ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. సీఎం జగన్ ను ఉద్దేశించి ‘అప్పురత్న’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి ఓ కార్టూన్ ని కూడా పోస్ట్ చేశారు.
‘అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు సీఎం జగన్ కు ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ ఆర్ధిక సంవత్సరంలో గడచిన 9నెలల కాలానికి ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.55, 555 కోట్లకు చేరింది. అప్పులతో ఆంధ్రా పేరును ఇలానే కొనసాగించండి మీ వ్యక్తిగత సంపాదనను పెంచుకోవడం మర్చిపోవద్దు.. రాష్ట్ర సంపద, భవిష్యత్ను గాలికొదిలేసి మీ సంపద పెంచుకోండి’.
‘రాష్ట్రాభివృద్ధిని, సంపదను కుక్కలకు వదిలేయండి. భారతరత్న తరహాలో మీకు “అప్పురత్న” అవార్డు ఇవ్వాలి’ అని పవన్ ట్వీట్ చేశారు. ఇప్పటికే జీతాలు రాలేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న దశలో పవన్ చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍
P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊#AppuRatnaAPCM pic.twitter.com/bnZEOHdMFa— Pawan Kalyan (@PawanKalyan) February 7, 2023
519384 668103Howdy! I just wish to give a huge thumbs up for the fantastic information you may have here on this post. I will probably be coming back to your weblog for more soon. 290933
54435 582321hi was just seeing in case you minded a comment. i like your site and the thme you picked is awesome. I will likely be back. 905566
752100 464282What a lovely weblog page. I will undoubtedly be back once more. Please keep writing! 11352