Namo Bharat: దేశీయ టెక్నాలజీతో తయారైన తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘నమో భారత్’ (Namo Bharat)ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లోని సాహిబాబాద్ స్టేషన్లో ఢిల్లీ-గాజియాబాద్-మేరఠ్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ ను ప్రారంభించారు. గంటకు 180 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ ర్యాపిడ్ ఎక్స్ (RapidX) రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని రైలులో ప్రయాణించి స్కూల్ విద్యార్ధులు, సిబ్బందితో ముచ్చటించారు. రూ.3వేల కోట్లతో చేపట్టిన రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రైలుసాహిబాబాద్-దుహై మధ్య 17 కి.మీ ప్రయాణిస్తుంది.
6కోచ్ ల్లో 2+2తో జనరల్ 62, ప్రీమియంలో 72 సీటింగ్ నుంచుని ప్రయాణించేవారితో కలిపి ఒకేసారి 1700 మంది ప్రయాణించొచ్చు. ఉదయం 6నుంచి రాత్రి 11వరకూ సేవలందిస్తాయి. నుంచునే వారికి విశాలమైన ప్లేస్, ఏసీ, సీసీటీవీ కెమెరా, రూట్ మ్యాప్స్, పుష్ బ్యాక్ సీట్లు, ఫుట్ రెస్ట్, బుక్స్, కోట్ ర్యాక్, మహిళలకు, దివ్యాంగులకు స్పెషల్ సీటింగ్, మహిళలకు స్పెషల్ కోచ్ వంటివి ఉన్నాయి. జనరల్ టికెట్ రూ.20-25, ప్రీమియం రూ.40-100 మధ్య ఉంటాయి. ప్రీమియంలో ప్రయాణికుల సహాయం కోసం ఒకరు అందుబాటులో ఉంటారు.
PM @narendramodi interacts with school children and crew of RapidX train – ‘NaMo Bharat’ – connecting Sahibabad to Duhai Depot, onboard the train.@PMOIndia@officialncrtc#RRTSTrain #RRTS pic.twitter.com/58yaRWyEsa
— DD News (@DDNewslive) October 20, 2023