గులాబీ పురం వర్సెస్ జిలేబీ పురం.. ఏలియన్స్ టాస్క్ సందర్భంగా బిగ్ హౌస్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అడపా దడపా చోటు చేసుకుంటున్నాయి. నీళ్ళలో ముంచిన పెట్టె నుంచి ఓ బ్యాటరీ లాంటిదాన్ని తీసి, ఏలియన్స్ వాహనానికి అమర్చడం ఓ టాస్క్. ఈ టాస్క్ సందర్భంగా అమర్ దీప్ – సందీప్ మధ్య వ్యవహారం ఫిజికల్గా మారింది.
టాస్క్లో తమ జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది శోభా శెట్టి. అపోజిషన్ టీమ్లో వున్నాగానీ, ప్రియాంక తనకే మద్దతునివ్వడం పట్ల అమర్ దీప్ ఆనందం వ్యక్తం చేశాడుగానీ, అమర్ దీప్ నోటి దురద నేపథ్యంలో ప్రియాంక హర్ట్ అయ్యింది.
అంతకు ముందు టాస్క్ సందర్భంగా తాళాల్ని దాచెయ్యాలనే ఆలోచన చేశారు ప్రియాంక, సందీప్. కానీ, వాళ్ళ పప్పులుడకలేదు. సంచాలక్ శివాజీ, ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగానే వ్యవహరించాడు.
కాగా, ఊర్లో వ్యవహారాలు నడుస్తున్న సమయంలో, అశ్విని పాత్రని ఉద్దేశించి ‘క్యారెక్టర్ లెస్’ అన్న ప్రస్తావన వచ్చింది. సందీప్ – యావర్ మధ్య ఈ ప్రస్తావన రావడాన్ని సీరియస్గా తీసుకుంది, స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చేసింది అశ్విని. ‘అబ్బాయిలంతా అమ్మాయి వెంట పడతారు. అంతే తప్ప, ఆ అమ్మాయి క్యారెక్టర్ లెస్ కాదు’ అని వాదించింది.
మాజీ భార్యతో ఒక రోజు ఆనందంగా గడపాలన్న మాజీ సర్పంచ్ కోరిక నెరవేరిందిగానీ.. ఈ టాస్క్లో పెద్దగా ఫన్ జనరేట్ అవలేదు.
ఇదిలా వుంటే, టాట్టూ వేసుకోవాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించడాన్ని టేస్టీ తేజ జీర్ణించుకోలేకపోయాడు. ‘పెళ్ళి కావాల్సినవాడిని. టాట్టూ కుదరదు.. అది కూడా అమ్మాయి టాట్టూ అంటే అస్సలు కుదరదు. బిగ్ బాస్ టాట్టూ అయితే వేయించుకుంటా..’ అంటూ మొరపెట్టుకున్నాడు.
ఎపిసోడ్ చివర్లో కేక్ వ్యవహారం సస్పెన్స్గా మారింది. కేక్ మీద శోభ పేరు వుంది. అందులోంచి కొంత భాగాన్ని లటుక్కున తినేశాడు అమర్ దీప్. ఆ తర్వాత హౌస్లో అందర్నీ పిలిచి కేక్ కట్ చేశాడు తేజ. శోభకి తినిపించాడు.. శోభ కూడా తేజకి తినిపించింది. ‘ముందుంది ముసళ్ళ పండగ..’ అని ఆ కేక్ పక్కనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.