Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో గెలుపుకు బాటలు వేసుకుంటున్నారు. ఈక్రమంలో ఆయనకు సొంత కుటుంబం నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పిఠాపురంలో బాబాయి గెలుపు కోసం ప్రచారం చేశారు వరుణ్ తేజ్ (Varun Tej). ఇప్పుడు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej కూడా విస్తృత ప్రచారానికి సిద్ధమయ్యారు.
మే 4,5,6 తేదీల్లో ఆయన వరుసగా మచిలీపట్నం, పిఠాపురం, కాకినాడ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఈమేరకు ఇప్పటికే మచిలీపట్నం చేరుకున్న ఆయన ప్రచారానికి ఏర్పాట్లు చేసుకున్నారు. తమ కుటుంబానికి మా ఊరు అనే విధంగా పిఠాపురంను ఎంపిక చేసుకున్నామని.. పవన్ గెలుపుతో మా ఊరు అనిపించేలా చేయాలని వరుణ్ తేజ్ చేసిన ప్రచారం స్థానికుల్లో జోష్ నింపింది. దీంతో ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ప్రచారంపై కూడా ఆసక్తి నెలకొంది. మావయ్యతో అత్యంత చనువు వుందని చెప్పే సాయిధరమ్ రాక.. జనసేన శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.