ఆర్థిక మాంద్యం ప్రభావం నేరుగా కనిపించడం ప్రారంభమైంది. దేశంలో తొలుత ఆటోమొబైల్ రంగం దీని ప్రభావానికి గురి కాగా, తాజాగా రియల్ రంగం కుదేలవుతోంది. ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. ఏపీకి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తారనే ఊహాగానాలు వెలువడగానే అక్కడ రియల్ భూమ్ ఏకంగా హైదరాబాద్ ను మించిపోయింది. భూముల ధరలు కోట్లకు కోట్లు పలికాయి. అనంతరం తగ్గుదల ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ రియల్ రంగం పాతాళానికి వెళ్లిపోయింది.
ఒకప్పుడు కోట్లకు కోట్లు పలికిన భూముల ధరలు ఇప్పుడు సగానికి పైగా తగ్గిపోయాయి. అమరావతిలో రియల్ రంగం తగ్గినా.. హైదరాబాద్ లో మాత్రం మొన్నటి వరకు స్థిరంగా కొనసాగింది. తాజాగా భాగ్య నగరంపైనా మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. ఫ్లాట్లు, గృహాల క్రయవిక్రయాలు దాదాపుగా నిలిచిపోయాయి. నగరంలోనూ కాదు.. శివార్లలోనూ కొనుగోళ్లు జరగడంలేదు.
మొన్నటి వరకు యాదాద్రిలో మంచి ఊపు మీద కనిపించిన స్థిరాస్థి రంగం.. ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది. వెరసి ఈ పరిస్థితి ఉద్యోగాలపై పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మాణాలకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే స్థితిలో ఆయా కంపెనీలు లేవని, ఫలితంగా పరిస్థితులు జఠిలంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ పరిస్థితులను అధిగమించేందుకు నిర్మాణ రంగానికి సంబంధించిన కంపెనీలు వ్యయ నియంత్రణకు చర్యలు తీసుకుంటాయని, ఇందులో భాగంగా ఉద్యోగాల తొలగింపుపై దృష్టి సారిస్తాయని అభిప్రాయపడుతున్నారు. రానున్న రెండేళ్లలో రియల్ ఎస్టేట్, దాని అనుబంధ రంగాల్లో ఏకంగా 5 లక్షల ఉద్యోగాల్లో కోత పడటం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దు నుంచి మొదలైన ఈ ప్రభావం.. తాజాగా పతాక స్థాయికి చేరిందని వివరిస్తున్నారు. ప్రభుత్వం ఉద్దీపన చర్యలు ప్రకటించకపోతే మరింత ముప్పు ఖాయమని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు ఈ పరిస్థితి తప్పకపోవచ్చని చెబుతున్నారు.
24752 243226a good deal lately with my father so hopefully this will get him to see my point of view. Fingers crossed! mortgage banker new york 564847
775537 976851very great post, i definitely love this website, go on it 981824
455052 18629Awesome read , Im going to spend a lot more time researching this subject 82833