Switch to English

మోదీ నిబంధన ఆయన్నే ముంచేలా ఉందే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తొలిసారి పగ్గాలు చేపట్టినప్పుడు ఆయన వయసు 64 ఏళ్లు. పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసుకున్న తర్వాత కొంతమందిని దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిసి ఓ నిబంధన తీసుకొచ్చారు. 75 ఏళ్లు పైబడిన రాజకీయ నాయకులు ప్రభుత్వంలోగానీ, పార్టీలోగానీ కీలకమైన పదవులకు దూరంగా ఉండాలన్నది ఆ రూల్. ఈ నిబంధనను ఇద్దరూ కలిసి ప్రతిపాదించడం, ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఫలితంగా పార్టీ సీనియర్లు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలకు ప్రభుత్వంలోగానీ, పార్టీలో గానీ ఎలాంటి పదవులూ ఇవ్వలేదు. కీలక పదవుల్లో ఉన్న కొంతమంది చేత రాజీనామా కూడా చేయించారు. అప్పటి నుంచీ ఈ నిబంధనను చాలా కచ్చితంగా అమలు చేస్తున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం కొంతమందిని ఇదే కారణంతో పోటీకి సైతం నిలపలేదు. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ కొంతమంది పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి, ప్రధాని కావాలంటే ఏం చేయాలని అడగ్గా.. మరో 20 ఏళ్ల పాటు నీకు ఆ అవకాశం లేదని, ఈ 20 ఏళ్లపాటు తానే ప్రధానిగా ఉంటాను కాబట్టి, నువ్వు 20 ఏళ్ల తర్వాత ప్రయత్నాలు చేయాలని ఆ విద్యార్థికి సూచించారు. అంటే తనకు 84 ఏళ్లు వచ్చినా, ప్రధాని పదవిలో కొనసాగుతానని అప్పట్లో పేర్కొన్నారు. అంటే.. తాను తీసుకొచ్చిన నిబంధన మరచిపోయి అలా చెప్పారో లేక ఆ నిబంధన తనకు వర్తించదన్న ఉద్దేశంతో చెప్పారో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

అయితే, కొంతమందిని దూరంగా ఉంచేందుకు తీసుకొచ్చిన ఈ నిబంధనే మోదీకి ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మోజార్టీ సాధించిన నరేంద్ర మోదీ.. రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన వయసు 69 సంవత్సరాలు. ఈ టెర్మ్ పదవీకాలం పూర్తయ్యే సరికి మోదీకి 74 ఏళ్లు వస్తాయి. 2024లో కూడా ఒకవేళ బీజేపీయే అధికారంలోకి వస్తే మోదీ ప్రధాని పదవి చేపట్టడానికి అర్హులు కాదు. అంటే.. ఆయన తీసుకొచ్చిన నిబంధనే ఆయనకు అడ్డంకిగా మారనుందన్న మాట. ఈ పరిస్థితి రావడానికి ఇంకా ఐదేళ్ల సమయం ఉన్నప్పటికీ, దీనిపై అప్పుడే చర్చ జరుగుతోంది.

ఒకవేళ ఈ నిబంధనకు కట్టుబడి మోదీ ప్రధాని పదవి చేపట్టకపోతే అప్పుడు అవకాశం ఎవరికి వస్తుందనే అంశంపైనా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ విషయంలో రెండో మాటకు తావు లేకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకే ప్రధాని పీఠం దక్కుతుందని అంటున్నారు. ప్రస్తుతం షా వయసు 55 ఏళ్లు కావడమే ఇందుకు అనుకూలమైన అంశమని చెబుతున్నారు. ఇవన్నీ ఆలోచించే, అనుభవం కోసం ప్రస్తుతం ఆయన్ను కేంద్ర హోంమంత్రిగా చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2024లో కూడా బీజేపీదే విజయం అయిన పక్షంలో అమిత్ షా ప్రధాని అవుతారా లేక తాము తీసుకొచ్చిన నిబంధనను మోదీ, షా ద్వయం సవరించేస్తారా అన్నది ఇప్పుడే చెప్పలేం. రాజు తలుచుకుంటే కానిదేముంటుంది?

Related Posts

ప్రత్యేక హోదా ‘మచ్చ’ చెరిపేసుకోనున్న మోడీ!

జగన్‌కి వ్యతిరేకంగా ‘స్కెచ్‌’ రెడీ చేస్తున్న మోడీ

మోడీకి వంగి వంగి దండాలెట్టాలా వైఎస్‌ జగనూ!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...