Switch to English

MM Keeravani: ‘రాంగోపాల్ వర్మ నా ఫస్ట్ ఆస్కార్’: ఎంఎం కీరవాణి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,838FansLike
57,764FollowersFollow

MM Keeravani: సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను ఆస్కార్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పొగడ్తలతో ముంచెత్తారు. తనకి ఎవరు అవకాశాలు ఇవ్వని రోజుల్లో తన ప్రతిభను గుర్తించింది ఆర్జీవి మాత్రమేనని గుర్తు చేసుకున్నారు. ఆయన సంగీతం అందించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన మనసులోని మాటను పంచుకున్నారు. ఆర్జీవి ‘క్షణక్షణం’ మీ కెరీర్ ను ముందుకు తీసుకెళ్ళిందన్న విషయంపై మీ అభిప్రాయం ఏంటి? అన్న ప్రశ్నకు కీరవాణి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

‘ మీరు అడిగారు కాబట్టి మీకో విషయం చెప్తున్నా. నేను కంపోజ్ చేసిన ట్యూన్లు పట్టుకొని 51 మంది వద్దకు వెళ్లాను. ఏ ఒక్కరు నన్ను ప్రోత్సహించలేదు. కొంతమందికి ట్యూన్లు నచ్చినా అవకాశం ఇవ్వలేదు. మరి కొంతమంది మొహం చాటేశారు. ఈ దశలో ఆర్జీవి నన్ను నమ్మి ‘క్షణక్షణం’ లో అవకాశం ఇచ్చారు. నేను ఆర్జీవి దగ్గర పనిచేస్తున్నాను అంటే నాలో ఎంతో కొంత ప్రతిభ ఉన్నట్టే అని అప్పుడు నాకు అవకాశాలు క్యూ కట్టాయి. ఆ ఏడాది చాలా సినిమాలకు పని చేశాను. ఆర్జీవి వల్లే నేను ప్రపంచానికి తెలుసు కాబట్టి ఆయనే నా ఫస్ట్ ఆస్కార్. ఇప్పుడు నేను అందుకున్న అకాడమీ అవార్డు రెండోది’ అని ఆర్జీవిని ప్రశంసించారు.

కీరవాణి వ్యాఖ్యలపై ఆర్జీవి స్పందించారు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ. ‘ ‘చనిపోయిన వాళ్లకు మాత్రమే ఇలాంటి ప్రశంసలు లభిస్తాయి. కాబట్టి నాకిప్పుడు చనిపోయిన భావన కలుగుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఆర్జీవి దర్శకత్వం వహించిన ‘క్షణక్షణం’ మ్యూజికల్, కమర్షియల్ హిట్టుగా నిలిచింది. ఇందులో వెంకటేష్, శ్రీదేవి జోడీ ఆకట్టుకుంది. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలోని ‘జామురాత్రి జాబిలమ్మ’ పాటను ఇప్పటికీ హమ్ చేసుకుంటూనే ఉన్నారు.

19 COMMENTS

సినిమా

శ్రీలీలను డామినేట్ చేసిన కెతిక శర్మ..!

నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్ శ్రీలీల అన్నారు కానీ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే అందరు కెతిక శర్మ అనుకోక తప్పదు....

అదే రాబిన్ హుడ్ స్ట్రెంత్ అంటున్న నితిన్..!

లవర్ బోయ్ నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి...

Ram Charan Birthday Special: ‘ఆరెంజ్’ మూవీ మ్యాజిక్.. రీ-రీ-రిలీజులతో రికార్డులు

Ram Charan: ప్రతి హీరో కెరీర్లో ప్రేమకథల సినిమాలు ఉంటాయి. గ్లోబల్ స్టార్ హోదాలో ఉన్న రామ్ చరణ్ కూడా ప్రేమకథలో నటించారు. కానీ, ఆ...

మిస్ లీడింగ్ థంబ్ నైల్స్ పై నటి గాయత్రి భార్గవి సీరియస్..!

వ్యూస్ కోసం కొంతమంది పెట్టే చీప్ థంబ్ నైల్స్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఎన్ని విధాలుగా ఛీ కొడుతున్నా సరే వాళ్లు...

Tollywood: ‘పక్కోడి ముందు పరువు తీసేసుకోవాలి’ ఇదే టాలీవుడ్ నయా ట్రెండ్..!

Tollywood: ఎక్కడైనా, ఎవరైనా తమ పరువు కాపాడుకోవాలనే చూస్తారు. వేరేవారి ముందైతే తప్పనిసరిగా కాపాడుకుంటారు. కానీ.. తెలుగువాళ్లు తమ పరువు తీసుకోవడానికి.. మరీ ముఖ్యంగా ఇతరుల...

రాజకీయం

యుద్ధ ప్రాతిపదికన రుషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ.!

రుషికొండ బీచ్.. విశాఖపట్నంలో అత్యంత సుందరమైన బీచ్‌లలో ఇది కూడా ఒకటి.! గతంలో, ఈ రుషికొండ బీచ్‌లో పర్యాటకుల కోసం పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రుషికొండ బీచ్‌కి ప్రతిష్టాత్మకమైన...

పోసాని విడుదల.. ఇకనైనా పద్ధతి మార్చుకుంటాడా.?

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజులుగా జైలు జీవితానికే పరిమితమయ్యారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద...

డీలిమిటేషన్ పంచాయితీ: వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదు.?

డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల...

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

ఎక్కువ చదివినవి

త్వరలో గుడ్‌ న్యూస్ వింటారు : లోకేష్‌

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు...

శ్రీలీలను డామినేట్ చేసిన కెతిక శర్మ..!

నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్ శ్రీలీల అన్నారు కానీ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే అందరు కెతిక శర్మ అనుకోక తప్పదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 18 మార్చి 2025

పంచాంగం తేదీ 18-03-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ చవితి సా. 7.02 వరకు...

రాజకీయాలు ఎన్నికల వరకే, ప్రభుత్వం శాశ్వతం : లోకేష్‌

ఎన్నికల సమయం వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే పరిపాలన అస్తవ్యస్తం గా మారుతుందని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ప్రభుత్వం మారిన సమయంలో అభివృద్ధి,...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి ఘన సత్కారం జరిగింది. చిరంజీవికి లైఫ్...