ఈఎస్ఐ మెడికల్ స్కామ్ కి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయంలో ఏం జరిగిందో తలచుకుని ఒకింత కంగారుపడుతున్నట్టున్నారు టీడీపీ నేత పితాని సత్యనారాయణ. ఈ కేసులో తన కుమారుడిపైనా ఆరోపణలు రావడంతో, ముందస్తు బెయిల్ దిశగా తన కుమారుడ్ని అలర్ట్ చేసినట్లే కన్పిస్తోంది. పితాని సత్యనారాయణ తనయుడు సురేష్ ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పితాని వద్ద పీఎస్గా పనిచేసిన మురళీమోహన్ కూడా ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని అభ్యర్థించడం మరో ఆసక్తికరమైన అంశం.
అయితే, ముందస్తు బెయిల్కి సంబంధించి న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది. ‘ఆ స్కామ్ విషయంలో మాకేం సంబంధం లేదు..’ అని ఇప్పటికే పితాని సత్యనారాయణ స్పందించారు. కానీ, తెరవెనుక వ్యవహారాలు వేరేలా వున్నాయి. ‘అచ్చెన్నాయుడికి ఇంకా బెయిల్ రాలేదంటే, కేసులో సీరియస్నెస్ ఎక్కువగానే వున్నట్టు లెక్క..’ అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. ‘అబ్బే, అది అసలు అచ్చెన్నాయుడికి సంబంధం లేని వ్యవహారం..’ అని టీడీపీ అంటోంది.
అచ్చెన్నాయుడిని ముందు పెట్టి తెరవెనుక వ్యవహారాల్ని పితాని సత్యనారాయణ తనయుడు, ఇంకొందరు టీడీపీ నేతల వారసులు నడిపారన్నది వైసీపీ చేస్తోన్న ఆరోపణ. ఈ ఆరోపణల్లో నిజమెంతోగానీ, ‘ముందస్తు బెయిల్’ అంశం నేపథ్యంలో ఈ వ్యవహారంలో పితాని సత్యనారాయణ తనయుడి పాత్ర సుస్పష్టయ్యిందని వైసీపీ కుండబద్దలుగొట్టేస్తోంది.
కాగా, ఈ మొత్తం వ్యవహారానికి అసలు సూత్రధారి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తనయుడు లోకేష్ అనీ, అచ్చెన్నాయుడు అప్రూవర్గా మారితే లోకేష్కి చిక్కులు తప్పవని వైసీపీ చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా మరింత కలకలం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో మరిన్ని అరెస్టులు వుంటాయనీ, ఇది చాలా పెద్ద స్కామ్ అనీ వైసీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్న విషయం విదితమే. టీడీపీ మాత్రం, ‘అచ్చెన్నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు..’ అని అంటోంది. ఎవరి వాదనలు ఎలా వున్నా, అంతిమంగా తప్పొప్పుల్ని తేల్చాల్సింది న్యాయస్థానమే.
161554 20877Thank you for this. Thats all I can say. You most certainly have created this into something thats eye opening and critical. You clearly know so significantly about the topic, youve covered so a lot of bases. Wonderful stuff from this part with the internet. 77242