ఈ కరోనా వైరస్ తెచ్చిన లాక్ డౌన్ వలన అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది మాత్రం వలస కూలీలే అని చెప్పాలి. ఉన్న చోట తిండి లేక కొందరు, కాలినడకన కొందరు, మార్గ మధ్యంలో యాక్సిడెంట్స్ తో కొందరు తమ స్వస్థలాలకు చేరుకోకనే చనిపోయారు. 14 రోజులు క్వారంటైన్ ముగించుకొని ఎన్నో ఆశలతో స్వస్థలానికి బయలు దేరిన వలస కూలీల బస్సు బోల్తా పడి 32 మందికి తీవ్ర గాయాలైన ఘటన శ్రీకాకుళం జిల్లా, మందస మండలం, బాలిగాం వద్ద జరిగింది.
అసలు విషయంలోకి వెళితే.. బెంగుళూరు లో నివసిస్తున్న వలస కూలీలు ప్రభుతం పెట్టిన 14 రోజుల క్వారంటైన్ టెస్ట్ పూర్తి చేసుకున్న 42మంది బస్సులో స్వస్థలమైన పశ్చిమ బెంగాల్ కి పయనమయ్యారు. బెంగుళూరు నుంచి మొదలైన ఈ బస్సు ఈ రోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా బాలిగాం దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది. దాంతో బస్సులోని 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు క్షత గాత్రులను పలాస ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మొత్తం 42 మంది ఉన్న ఈ బస్సు బోల్తా వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అక్కడి వారు చెబుతున్నారు.
919819 823608Some really excellent info , Gladiola I found this. 961160
756339 611022Im not sure exactly why but this internet web site is loading incredibly slow for me. Is anyone else having this problem or is it a problem on my end? Ill check back later and see if the difficulty still exists. 530607